Home » TG Govt
సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ, R&R కోసం రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. నిధుల కొరతతో సాగునీటి పనులు ఆగొద్దని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్డ్ రేషన్ కార్డుల పంపిణీకి జిల్లా పౌర సరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది.
తెలంగాణలో 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) వర్తింపజేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అర్హులైన వారికి ‘చేయూత’ పథకం ద్వారా సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రెవెన్యూ శాఖలో అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పారదర్శక సేవలతో పాటు బాధ్యతాయుతంగా ఉండేలా చర్యలకు శ్రీకారం చుట్టింది.
రాయదుర్గం భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. TGIIC దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశించిన డ్రోన్ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
తెలంగాణకు 150 కొత్త జీసీసీలు 20 నెలల్లో రానున్నాయని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. జీసీసీలతో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
జొన్న రైతులకు రూ.994 కోట్లు జమ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. 1.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసినట్లు స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలోని గోపాలపురం పాఠశాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండగా నిలబడ్డారు. ఆ పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశారు.
తెలంగాణలో డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బుధవారం ప్రారంభించారు.