Home » TG Govt
సింగరేణి కార్మికుడి శ్రమ, చెమటని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు మాట్లాడుతున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై చేస్తున్న ఆరోపణలతో తన మనసు కలచి వేసిందని.. అందుకే అధికారులతో కలిసి ఓపెన్హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు.
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను శనివారం అధికారులు రికార్డ్ చేశారు.
కేంద్రం జులై 1వ తేదీ నుంచి అమలు చేయాలని తలపెట్టిన వీబీజీ రాంజీ స్కీం పట్ల నిరసన తెలపాలని తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తమ నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు.
రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది... గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు.
భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఎయిర్ఫోర్స్ పాత్ర చాలా కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్లో కూడా ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడమే తప్ప.. నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
దేశాభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు..
డీఈఓలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును (ఎన్రోల్మెంట్) పెంచాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్.. డీఈఓలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్ను మరింత అభివృద్ధి చేస్తున్నామని.. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారని హెచ్చరించారు.