Home » TG Govt
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినేనని తెలిపారు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెనెడీ స్కూల్లో తన ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ను ఉత్సాహంగా ప్రారంభించారు. రాష్ట్ర పాలనలో ఆధునిక దృక్పథాన్ని అలవర్చుకునే దిశగా ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు..
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసు శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఏసీపీ, డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పద్మ పురస్కారాలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
నాంపల్లి భారీ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పందించారు. అగ్ని ప్రమాద సంబంధిత కారణాలను మీడియాకు వెల్లడించారాయన.
నాంపల్లిలో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు వ్యాపించకుండా పక్క భవనాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని ఆరోపించారు.
ఫోన్ట్యాపింగ్ కేసులో దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
నూతన వాహనాల కొనుగోలుదారులు వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇకపై రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.