Home » TG Govt
తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి.. కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద యోగా దినోత్సవంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు
పాడి రైతుకు భరోసా కల్పిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విజయ డెయిరీకి ప్రభుత్వ అండగా ఉంటుందని మాటిచ్చారు. 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు.
తెలంగాణ జాతిపిత జయశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కీర్తించారు.
వీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన లేఖ రాశామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నూతన చట్టాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని.. పనిగట్టుకుని తమను కొందరు బద్నాం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఉండాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో ఊహించి ఉండరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు.