Home » TG Govt
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, కనీస నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెరలేపాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్పైన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, సరస్సులు, వెట్ల్యాండ్స్ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల సమీక్షా సమావేశం మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని మాత్రమే తాను మాట్లాడానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేసే అంశంపైనే తాను మాట్లాడానని.. తన మాటలను కొంతమంది వక్రీకరించారని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని నర్సులకు విదేశాల్లో ముఖ్యంగా జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో 'ట్రిపుల్ విన్' ప్రోగ్రాం వివరాలను వెల్లడించారు.
తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.