Home » TG Govt
డ్రగ్స్ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబసభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ కేసు నీరుగార్చారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్ను శుక్రవారం విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం టీజీఈఆర్సీకి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు డిమాండ్ ఛార్జీలు రద్దు చేయాలంటూ ప్రతిపాదన చేశారు.
పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అసత్య ప్రచారాలను బలంగా తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలమూరుకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు.
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.255 కోట్ల ట్రిప్స్ పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.
గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ ఘటన దురదృష్టకరమని తెలంగాణ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం విచారణకు అదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఓ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సదరు భూములపై విజిలెన్స్ అధికారుల విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ సర్కార్.
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణ ఈరోజు(సోమవారం)తో పూర్తికానుంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది.