Home » TG Govt
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. పంజాబ్ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.
సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
ఐటీ రంగాన్ని హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs) ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి సర్కార్ నిర్ణయించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాన వేడుకలు జరగనున్నాయి.
తెలంగాణ రాజకీయాలు, పాలనా నిర్ణయాల్లో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం నిర్వహణ అత్యంత ఆసక్తికరంగా మారింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా, కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది.
పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల, ఎస్ఎల్బీసీ, సీతారామ ప్రాజెక్టులతో సమాన ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో నిర్వహించనున్న టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా మే 28వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా ట్రస్టు ఏర్పాటు చేసింది.
మహిళల పట్ల సర్కారు చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.