Home » Telugu News
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 3వ తేదీన జిల్లాకు రానున్నారు. గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువకు విడుదల చేసి, పాయకరావుపేట వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
Job calendar sparks hope among the unemployed కూటమి ప్రభుత్వం 10,060 పోస్టుల భర్తీకిగానూ జాబ్క్యాలెండర్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎలా అయినా ఈసారి ప్రభుత్వ కొలువులు దక్కించుకోవాలనే ఉద్దేశంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
2011 లోపు ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీ మోహన్రావు డిమాండ్ చేశారు.
Further delay in teacher allocation... జిల్లాల వారీగా ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ జాప్యమవుతోంది. దీంతో ఉపాధ్యాయుల్లో గుబులు రేగుతోంది. విభజన ఉంటుందా? లేదా?.. ఎప్పుడు.. ఎలా చేస్తారు.. కేడర్ సీనియార్టీనా, వయసువారీగా పరిగణలోకి తీసుకుంటారా..? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏజెన్సీలో రహదారులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
రాష్ట్రంలో అక్టోబరు ఒకటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు అందించనున్నామని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మె ల్యే కూన రవికుమార్ తెలిపారు.
ఉద్యాన రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం రీజనల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డా.మాధవీలత అన్నారు.
భారతీయ సంప్రదాయ భాష సంస్కృతంపై విద్యార్థులు చూపెడుతున్న ఆసక్తి అభి నందనీయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
చెడు వ్యసనాలకు బానిసై ఓ డిగ్రీ విద్యార్థి దొంగతనాలకు అలవాటుపడి పోలీసులకు పట్టుబడిన ఘటన మంగళవారం సంభ వించింది. కాశీబుగ్గ డీఎస్పీ భవాని విలేకరులతో మాట్లాడుతూ ఆ వివరాలు వెల్లడిం చారు. సోంపేట మండలం ఇస్కలపాలేనికి చెందిన వాసుపల్లి తాతారావు (20) బారువ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడి దొంగతనా లను వ్యసనంగా మార్చుకుని కవిటి, ఇచ్ఛాపురం, బారువలో ఏడు దొంగతనాలు చేశాడు. ఉదయం వేళ తెలిసిన వారి ఇళ్లనే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడేవాడు.
మండలం లోని గొల్లవూరులో అభయ్ ఫౌండేషన్ సామాజిక సేవా సంస్థ రూ.15 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు నిర్వహణకు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వీటి వినియోగానికి ఆసక్తి కనబరచడం లేదు. ఇక్కడ వారంతా ఆరుబయటే మలవిసర్జన చేస్తున్నారు.