Home » Telugu Desam Party
ప్రజలు ఎన్నికల్లో బుద్ది చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు కనిపించడం లేదని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే వైసీపీకి తెలియదని ఆక్షేపించారు. ఏపీ విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ నేతలు పీహెచ్డీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6వ తేదీన డాలస్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. యువనేత సభ కోసం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.
ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆదివారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ శివనాథ్ పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని ప్రజా సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు బస్సు దుర్ఘటనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో వైసీపీ, బ్లూ మీడియా అనేక తప్పుడు కథనాలు సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.
తిరువూరు టీడీపీ ఇష్యూపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తాను టీడీపీలో క్రమ శిక్షణగల నాయకుడినని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలని ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై, మీడియా, సోషల్ మీడియాల్లో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.