Home » Telugu Desam Party
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విజయవాడ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం పర్యటనకు తాము ఎప్పుడు ఆటంకం కలిగించమని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ నేతలు.. వైసీపీ బాటలో వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ సీనియర్ నేతలు. చట్టాన్ని గౌరవించాలని, సమన్వయం పాటించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని.. ఆ ట్రాప్లో పడొద్దని తెలుగుదేశం నేతలకు సూచించారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఈ కేసు నమోదైంది.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు గుంటూరులో నిరసన సెగ తగిలింది. చిల్లీస్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం బందిమడుగుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు, ఎమ్మార్పీఎస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
మాజీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనంతపురం అర్భన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ ప్రసాదానికి కల్తీ నెయ్యి అందించడంపై ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.
గీతం విద్యా సంస్థల భూముల క్రమబద్ధీకరణపై జీవీఎంసీ కౌన్సిల్లో వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడం దారుణమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో లేనటువంటి కల్చర్ని తీసుకొస్తూ చాలా దారుణంగా ప్రవర్తించడాన్ని పౌర సమాజం కూడా ఖండిస్తోందని అన్నారు..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఏపీ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ భవిష్యత్తును మార్చేస్తున్నారని పేర్కొన్నారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్దేనని ధ్వజమెత్తారు.