Home » Telangana
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం అధినేత కేసీఆర్ ఇన్ఛార్జిలను ప్రకటించారు. డిజిటల్ ప్రక్రియలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జరగనుంది.
కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు.
దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.
మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘మహిళా వారోత్సవాలు’ నిర్వహించనుంది.
వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే పాలన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేస్తోన్న ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ సీనియర్లతో పాటు కొందరు మంత్రులు దీనిపై మౌనంగా ఉండటంతో రకరకాల చర్చలు సాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్న గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ దాకా కాగా.. రెండోది పోలవరం నుంచి చేపట్టేది...
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అండ్ కెమిస్ట్ అసోసి యేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో మెడికల్ షాపులను బంద్ విజయవం తమైంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, రాముగుం డం, గోదావరిఖని, మంథని, అన్ని మండ లాల్లో మందుల దుకాణాలను బంద్ చేశారు.
భానుడు భగభగమంటున్నాడు. జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. గత ఏడాది కంటే ఈ ఏడాది భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో 20 మంది లబ్ధిదారులకు ఉచితంగా మోటార్ ట్రైసైకిళ్లను అందజేశారు.
ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో వరి, మక్కల కొనుగోళ్ళలో మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.