Home » Telangana
2014లో స్వరాష్ట్ర ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచే.. బహుజనులు దండు కట్టి ఉద్యమించారని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధి విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కోర్ అర్బన్ రీజియన్ విస్తరింపును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. కోర్ అర్బన్ రీజియన్లో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ విలీనం చేయనుంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ ఎక్స్ ఖాతా పేర్కొంది. ఈ రోజు నుంచి ఉత్తర తెలంగాణలో వాతావరణం మరింత చల్లగా మారనుందని తెలిపింది.
తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన విషయాల్లో ముందు వెనక కట్ చేసి కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేళ్లు తెలంగాణలో తన నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తేల్చి చెప్పారు.
భూదార్ కార్డులపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ ఎంతో శ్రమిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డికి సహకరించాల్సింది పోయి.. ప్రతీది రాజకీయం చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన వసతులు ఇటు రోగులు, అటు సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పీహెచ్సీలలో మందులు నిల్వ చేసుకునేందుకు సరైన స్టోరీజీలు కూడా లేవు. ప్రజారోగ్యాన్ని పాలకులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.
ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఫ్యూచర్ సిటీ.. ఒక పెద్ద స్కాం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. దీని వెనుక చాలా మతలబు ఉందని, పారిశ్రామికీకరణ జరిగినంత మాత్రాన మానవ అభివృద్థి జరగదని పేర్కొంటున్నారు.