Home » Telangana
నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖని వ్యాపార, వాణిజ్య కూడలి అయిన శివాజీనగర్, మేదరిబస్తీ, లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్లోని కొందరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. వాహనాలను దుకాణాల ఎదుట పార్క్ చేస్తున్నా మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహచారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పూర్తితో ముందుకు సాగాలని ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో శివాజీ చౌక్లోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే మండలంలోని బెల్గాం గ్రామంలో శివాజీ మమారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొని నివాళులు అర్పించారు.
ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) పరిధిలోని మండల, గ్రామ సమాఖ్యలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న భవనాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు లేక అద్దె గదుల్లో, ఇరుకు ప్రాంగ ణాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మహిళా సంఘాల కు ఇకపై సమాఖ్య భవనాలు అండగా నిలువను న్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది
జిల్లాలో ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమాల్లో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె హరిత అన్నారు. న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా గేట్స్ ఫౌండేషన్ సీఈవో బిల్ గేట్స్, ఇతర కార్యదర్శులతో కలిసి నీతి తారా పథకాన్ని వర్చువల్ విధానంలో గురువారం నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని కలెక్టర్ కె హరిత అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని మైనార్టీ సంక్షేమ పాఠశాలలో ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల నూతన సర్పంచ్లకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి గురువారం కలెక్టర్ హాజరయ్యారు.
వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖాధికారులు ముందస్తుగానే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏటా వేసవికాలంలో జిల్లాలోని ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవతున్నా యి. ఎండల తీవ్రతకు అటవీప్రాంతాల్లో కుంటలు, చెలిమెలు, వాగులు, ఎండిపోవడంతో వన్యప్రా ణులకు నీటి ఎద్దడి నెలకొంటుంది.
మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ (గురువారం) సోదాలు నిర్వహించారు. పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తుల వ్యవహారంపై విచారణ చేపట్టారు..
సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్లో 16 తులాల బంగారం చోరీ జరిగింది. హైదరాబాద్లో వివాహ వేడుకకు వెళ్తున్న వృద్ధురాలు చెగురి లక్ష్మి బ్యాగు నుంచి దుండగులు నగలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జోగిపేట పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, మంత్రులు ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గే చర్చించారు. రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై రెండు గంటల పాటు ఖర్గే సమీక్ష జరిపారు..
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కోర్టులో గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు..