Home » Telangana
అమీర్పేటలో అగ్నిప్రమాదం జరిగింది. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్ప్రెస్ (12793 నంబర్) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
పోస్టల్ సేవలు నిరంతరాయంగా, వేగవంతంగా కొనసాగుతున్నాయి. తపాలశాఖను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 11, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 64, బజ్జి మిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
బాలాజీనగర్ సెక్షన్ పరిధిలోని సబ్స్టేషన్లలో మరమ్మతుల నేపథ్యంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో రెండేళ్ల పాలనను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రశంసించింది. పార్టీ పనితీరుపైనా సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. ఇలాగే కలిసి ముందుకెళ్లాలని సూచించింది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై అభినందనలు తెలిపింది.....
పత్తికి మద్దతు దర దక్కక రైతులు ఆందోళన నిర్వహించారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్కు 200 మందికి పైగా రైతులు పత్తిని తీసుకవచ్చారు. క్వింటాలు పత్తికి 6 వేల నుంచి 6,500 రూపాయలు పెట్టడంతో రైతులు ఆందోళనకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు గోపాల్ అన్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరిస్తూ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టాల్లు ఏర్పాటు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సర్పంచ్లకు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సూచిం చారు. పెద్దబొంకూరు మథర్థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు.
నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖని వ్యాపార, వాణిజ్య కూడలి అయిన శివాజీనగర్, మేదరిబస్తీ, లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్లోని కొందరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. వాహనాలను దుకాణాల ఎదుట పార్క్ చేస్తున్నా మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.