Home » Telangana
మహాభారతంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుడి కథను తలపించే ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక కొద్ది రోజులుగా తరగతి గదుల తాళాలు కూడా తీయడం లేదు.
మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాల యం శిథిలావస్థకు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితులు నెలకొనడంతో ఉపాధ్యాయులు, అధికారులు భయాందోళన చెందుతున్నారు.
అనాథ చిన్నారులకు అండగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల సంరక్షణలో లేని చిన్నారులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుంటుబాలకు రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్యలో సురక్షితమైన వాతావరణం కల్పిస్తూ పోషణ, పునరావాసం, మానసిక వికాసానికి ఈ పథకం దోహదపడుతుంది.
ఆదివాసీలకు పోలీసు ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కుల పోరాట కమిటీ, తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది.
ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్నగర్ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల గిరిజన పిల్లల భవిష్యత్తు బంగారు మయంగా మార్చే విద్యాలయమని తెలిపారు.
సర్ ప్రక్రియ పూర్తయినా తరువాత ఓటర్ల లేక్క తేలింది. ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ 2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్తో పాటు ఆర్డీవో, తహసిల్థార్, మండల పరిషత్, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పోలింగ్ బూత్ల వద్ద జాబితా ప్రదర్శించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2015లో సీఐడీ నమోదు చేసిన కేసులో బాలికలను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపిన ముఠాకు చెందిన 33 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. వారికి కఠిన శిక్షలు విధించింది.
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా ఖండించారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.రూపారెడ్డి ఈ నెల 11న దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడింది పూర్వ, ప్రస్తుత విద్యార్థులని తెలుస్తోంది.