Home » Telangana
అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ప్రభుత్వం దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇచ్చింది. జూలై31 వరకు 25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో ఎల్ఆర్ఎస్కు నామమాత్రంగానే స్పందన కనిపిస్తోంది.
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలకవర్గ కమిటీలను నియమించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కసరత్తు మొదలుపెట్టారు. నామినేటెడ్ విధానంలో నియమించా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆయా పదవులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
రామగుండం గురుకుల పాఠశాల పక్కన గల 26 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ అన్నారు. శనివారం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
సమష్టి కృషితో ఆరు నెలల్లో రాష్ట్రంలో గణనీయమైన మార్పు తీసుక వచ్చేలా ప్రతీ ఒక్క అధికారి పని చేయాలని, వాటి సాధన దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం వివిధ అంశాలపై ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమ ణారావు అన్నారు. శనివారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కు లను పంపిణీ చేశారు.
సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని, యూరియా యాప్ రాష్ట్రానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
రైతులు జీలుగ సాదు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడంతో భూసారం కోల్పోతుంది. దీంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయి. నేల, వాయు, కాలుష్యం పెరుగుతున్నాయని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం రాయితీపై పచ్చిరొట్ట ఎరువులను అందిస్తోంది. వీ
వర్షాకాలం ప్రారంభమై అడపాదడపా వర్షాలు కురుస్తు న్నాయి. అయితే మండలంలోని చెరువులను మాత్రం శుభ్రం చేసే పనులు చేపట్టలేదు. ఏళ్ల తరబడి శుభ్రం చేయక పూడిక చేరింది. అలాగే తూటికాడ(బేస్రం) అల్లుకపోయింది. ఇది మండల కేంద్రం సమీపంలోని బోలు చెరువు దుస్థితి....ఈ చెరువు కింద ఆయకట్టు సుమారు 200ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం చెరువులో చెత్తాచెదారం. ఇతర మొక్కల పెరుగుదలతో సాగునీరు నిల్వ లేకుండా పోతోంది.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం సర్ ప్రక్రియ సహాయ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణక్క కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై అపోహలు లేకుండా చూసుకోవాలన్నారు
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఉదయం నుంచి ముసురు వాన కురిసింది. బెజ్జూరు మండలంలో శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఒర్రెలు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవుతల ఉన్న గ్రామాలైన సుశ్మీర్, సోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, పాతసోమిని, నాగేపల్లి, బండలగూడ, గెర్రెగూడ తదితర గ్రామాలకు సాయంత్రం వరకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.