Home » Telangana
గతంలో మొబైల్ ఫోన్ పోయిం దంటే బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పటికి వారు కూడ దానిని రికవరీ చేసే పరిస్థితి లేకపోవడంతో బాధితులు నంబర్ బ్లాక్ చేయడం మినహ ఏం చేసే పరిస్థితి లేకుండేది. మొబైల్ ఫోన్ల దొంగల నుండి బాధితులను రక్షించడానికి పోలీసులు సీఈఐఆర్ వెబ్సైట్ తీసుకురావడంతో మొబైల్ ఫోన్ల దొంగలకు చెక్ పడతున్నట్లయింది.
ఏటా వర్షాకాలం వస్తుందంటే ఏజెన్సీ గ్రామాల్లో వణుకు మొదల వుతుంది. లోలెవల్ వంతెనలపై నుంచి ఉధృతంగా ప్రవహించే వాగులు, అనుహ్యంగా వచ్చే వరదలతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర సరుకుల కోసం ఆయా గ్రామాల ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. ఒక్కోసారి వరద ప్రవాహాన్ని దాటుతూ ప్రమాదాలకు గురైన సంఘటనలు సైతం చోటు చేసుకున్నాయి.
: జిల్లాలోని బెజ్జూరు, కెరమెరి మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బెజ్జూరు మండలంలో ఈదురుగాలులకు పలు గ్రామాల్లో పలువురు ఇళ్లపై కప్పు రేకులు గాలికి లేచి పోయాయి., మండలంలోని అందుగులగూడ, కుంటలమానేపల్లి, ఊట్పల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఆయా గ్రామాల్లోని పలువురు ఇళ్లలోని పై కప్పు రేకులు గాలికి లేచి పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
బాబూ జగ్జీవన్రామ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా షెడ్యూల్డ్ కులాలు, అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్రామ్ జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు
పశ్చిమాసి యాలో జరుగుతున్న యుద్ధం ప్రభా వం నిర్మాణ రంగంపై తీవ్రస్థాయిలో చూపుతోంది. ఇప్పటికే చమురు కొరత సామా న్యులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావం నిర్మాణ రంగంపై కూడా తీవ్రంగా ఉండబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిమెంటు ధర బస్తాకు రూ.30నుంచి రూ.50వరకు పెరగను న్నదని ప్రచారం జరగడంతో బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి వేదికగా జరిగిన ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి హెల్త్ వీక్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు నిశ్చయించుకున్నారు.
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు పోలీసులు.
సింగరేణి సంస్థ గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహన లేకపోవటం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికుల మీద ప్రేమతో సంస్థను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీలు ఏవైనా సరే అందులో ఉండే ట్రేడ్ యూనియన్లు మాత్రం కార్మికుల కోసమే మాట్లాడాలని కవిత హితవుపలికారు.