Home » Telangana
క్యాతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాల్క సుమన్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా బాల్కసుమన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లోని బేగంబజార్లో వెలుగులోకి వచ్చిన గంజాయి పాల ఉదంతం నగరవాసులను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు..
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ దాడులకు దిగిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
మున్సిపల్ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. త్వరలోనే ప్రతి జోన్లో పర్యటిస్తానని.. రోడ్డు శుభ్రంగా లేకపోతే అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని సీఎం హెచ్చరించారు..
అత్తాపూర్లోని హల్దీరామ్ స్వీట్ హౌస్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన, ఫంగస్ వచ్చిన స్వీట్స్ను అమ్మారని పోలీలసులకు బాధితులు ఫిర్యాదు చేశారు..
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో పలు విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.
తొర్రూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్కు తరలించారు.
25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ టార్గెట్ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐటీఐ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది..