Home » Telangana
ఏసుక్రీస్తు త్యాగం, ధైర్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిలషించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల పేరుతో పేదలను దోచుకున్నారంటూ ఏడుగురిని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. భూములు ఇప్పిస్తామంటూ నిరుపేదలను లక్షల్లో మోసం చేశారంటూ బల్లి శ్రీనివాస్, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారిని అరెస్టు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్ను ఏకపక్షంగా రద్దు చేయడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి చట్టబద్ధత బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చలో బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ పాల్గొన్నారు.
అదనపు కట్నం వేధింపులు తాళలేక పెళ్లైన నెలరోజులకే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ.619.85 కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిధుల్లో రూ.371.91 కోట్లు టైడ్ గ్రాంట్, రూ.247.94 కోట్లు అన్ టైడ్ గ్రాంట్ కింద ఉన్నాయన్నారు.
కాలేశ్వరం వల్ల ఉపయోగం లేదని నివేదికలు వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేసీఆర్పై విరుచుకుపడ్డారు.
సినిమాలో నటించాలనే ఆశతో నగరానికి వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అనకాపల్లికి చెందిన వండపల్లి సంజయ్ హైదరాబాద్కు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ ఆడిషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ అవినీతి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, గుడిలో ప్రమాణం చేస్తామనని కాంగ్రెస్ నేత తెలిపారు.
నగరంలో కొందరు ఆకతాయిలు వాహనాల నంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు. ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు ఇలాంటి దుశ్చర్యల కు పాల్పడుతున్నారు.