Home » Telangana Police
సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పాపులారిటీ ఉన్న ఇన్ఫ్లూయెన్సర్లు అయినాసరే చట్టానికి అతీతులు కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో పులువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ధరణి, భూ భారతి పోర్టల్లో సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు రూ.3.90 కోట్ల గండికొట్టిన ముఠా గుట్టురట్టు చేశారు. వరంగల్ పోలీసులు. 15 మందిని అరెస్ట్ చేసి, రూ. 63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు.
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, పరువు నష్టం కలిగించే పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.
సంక్రాంతి పండుగ వేళ దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 12 ఇళ్లల్లో చోరీకి తెగబడ్డ దుండగులు.. భారీగా నగదు, నగలను అపహరించారు.
మహిళా అధికారులపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ఆందోళనకరమని సీపీ సజ్జనార్ అన్నారు. ఇకపై మహిళలను అవమానిస్తే సహించేది లేదని సీపీ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ సీసీఎస్తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ సిట్కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు.
హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ భానుప్రకాశ్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం భాను ప్రకాష్ రెడ్డి చంచల్గూడ జైల్లో ఉన్నారు..
సికింద్రాబాద్ పరిధిలోని భోలక్పూర్ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం తీవ్రంగా ఉండటంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఫాంహౌస్ నీటి తొట్టిలో ప్రమాదవశాత్తూ పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందాడు.