Home » Telangana Chief Minister
సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
ఐటీ రంగాన్ని హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs) ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి సర్కార్ నిర్ణయించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాన వేడుకలు జరగనున్నాయి.
తెలంగాణ రాజకీయాలు, పాలనా నిర్ణయాల్లో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం నిర్వహణ అత్యంత ఆసక్తికరంగా మారింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా, కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది.
మహిళలపైన నేరాలను తమ ప్రభుత్వం నియంత్రించిదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో 8వ తేదీ రాత్రి బాలిక తల్లి పేట్ బషీరాబాద్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు.
గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర తనకు చాలా చొరవ ఉందని పేర్కొన్నారు.
కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేరళం ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేస్తూ... విలువలతో కూడిన రాజకీయాలు చేసే సతీశన్కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్పైన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.