Home » Telangana Chief Minister
సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డిని అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు సోమవారం కలిశారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్ని పక్కనబెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్రెడ్డి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.
తెలంగాణ కేబినెట్ని విస్తరించడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ని విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.
కామారెడ్డిలో వరద నష్టం అంచనాపై రీ సర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సూచించారు. కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ధర్మపూరి అర్వింద్ ప్రశ్నించారు.
రాబోయే ఏడాది వినాయక్ సాగర్లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ.50 వేలలోపు యూనిట్కు 100% రాయితీతో సహా వివిధ వివరాలతో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై చర్చలు జరిపారు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ఆషాఢ మాసంలో పురాణపండ శ్రీనివాస్ ఆర్షధర్మాల రమణీయ గ్రంధాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. లక్షల కొలది భక్తులకు ఇష్టమైన శ్రీ సహస్రనామాలు రెండింటితో ‘లలిత , విష్ణు’ల వెలుగులతో ముఖపత్రం శ్రీరాజరాజేశ్వరీదేవి మంగళ చిత్రంతో, వెనుక అట్టపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళానుగ్రహం కలగాలనే పవిత్ర స్వఛ్చ వాక్యనిర్మాణంతో ఈ గ్రంధం చోటుచేసుకోవడం విశేషం.