Home » Telangana BJP
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి భద్రత లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు..
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం నుంచి బీజేపీ నేతలందరినీ ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (KMC) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సరం నేడు అట్టహాసంగా జరిగింది. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు ఈ రోజు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.
నిజామాబాద్ కార్పొరేషన్ను తామే కైవసం చేసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డితో శనివారం సమావేశం అవుతానని.. ఈ భేటీలో కార్పొరేషన్ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ పదవిని దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీని నిలువరించడమే లక్ష్యంగా ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఒక అరుదైన, ఆసక్తికరమైన మలుపుగా మారింది.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగగా.. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. కానీ కొత్తగూడెం కార్పొరేషన్లో విషయానికొస్తే అమాంతం పొలిటికల్ హీట్ పెరిగింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.