Home » Team India
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో భారత స్పిన్నర్లు అరుదైన రికార్డును నెలకొల్పారు. ఐదో టెస్టు తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్ను మొదటి ఇన్నింగ్స్లో ఆలౌట్ చేశారు. భారత స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది.
ప్రస్తుతం భారత క్రికెట్లో, జాతీయ రాజకీయాల్లో కామన్గా వినిపిస్తోన్న పేరు మహ్మద్ షమీ. టీమిండియాలో పేస్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్న షమీ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబర్చి అందరికి దగ్గరయ్యాడు.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటు జట్టు కెప్టెన్గా, అటు బ్యాటర్గా సత్తా చాటుతున్నాడు. తన నాయకత్వ ప్రతిభతో జట్టుకు అద్భుత విజయాలు అందిచడంతోపాటు బ్యాటుతోనూ టీంకు మంచి ఆరంభాలను అందిస్తున్నాడు.
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. బజ్బాల్ వ్యూహం అంటూ భారత్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్కు అదే తరహా ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు.
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 90కి పైగా సగటుతో పరుగులు సాధించాడు.
టీమిండియాతో ఐదో టెస్టు మ్యాచ్లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేయగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టేల్స్ చెప్పాడు. టాస్ టేల్స్ పడడంతో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
ఐదు టెస్టుల సిరీస్ను ఇప్పటికే 3-1తో గెలుచుకుని ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా చివరి టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. సాధారణంగా అయితే టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్కు అంతగా ప్రాధాన్యత ఉండదు.
టీమిండియా స్టార్ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ను సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితా నుంచి బీసీసీఐ తొలగించడంపై క్రీడా వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నారు.
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో దుమ్ములేపుతున్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. ఫిబ్రవరి నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినీస్ షార్ట్ లిస్ట్ జాబితాలో జైస్వాల్కు చోటుదక్కింది.
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానుంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. గత సీజన్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు సన్నాహాకాలు కూడా మొదలుపెట్టారు.