Home » Team India
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సీజన్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. రేపటి(శనివారం) నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది.
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై మాజీ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఫీల్డింగ్లో చూపించే ఎనర్జీ అద్భుతమని కొనియాడాడు. విరాట్ ప్రభావం జట్టులోని మిగతా ప్లేయర్లపైనా పడుతుందని వెల్లడించాడు.
భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. అయితే జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. రీఎంట్రీ ఇవ్వడం వెనుక ఎంతో కఠోర శ్రమనే ఉంది. ఏడాదిన్నరగా కశ్మీర్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ.. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు.
భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
శ్రీలంక ఎలెవన్తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయపడటంపై వస్తోన్న విమర్శలకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో సీఓఈపై విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశాడు.
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు భారత్ జట్టుకు గుడ్ న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన కెప్టెన్ శుబ్మన్ గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? ఆందోళన అందరిలోనూ నెలకొంది. అయితే..
శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో టీమిండియా పేసర్ గుర్నూర్ బ్రార్ సునామీ బ్యాటింగ్ ఆడాడు. లంక బౌలర్ దిలుమ్ సుదీరకు చుక్కలు చూపించాడు.
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్కు తీవ్ర నిరాశ ఎదురైంది. గాయం కారణంగా ఇంగ్లండ్లో జరుగుతున్న 'ది హండ్రెడ్' 2026 నుంచి ఆమె వైదొలిగింది.