Home » Team India
భారత టీ20 జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. నేడు బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్తో రెండో టీ20లో తలపడనుంది. టాస్ నెగ్గిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ తుది పోరుకు రంగం సిద్ధమైంది. బెల్ఫాస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రమే రాణించాడు. అయితే...
పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ భారత్ ఘోరంగా ఓడింది. ఈ పరాజయంపై టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
భారత స్టార్ స్పిన్నర్ శ్రీ చరణి ఇటీవల ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా అవతరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతానికి తన దృష్టంతా టీ20 ప్రపంచ కప్ గెలవడంపైనే ఉందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం టీమిండియాలో కుర్రాళ్ల హవా నడుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు తమ దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే జట్టుకు కొత్త కళ తీసుకొచ్చారు. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపిక క్రికెట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
టీమిండియా క్రికెటర్ ఆకాశ్దీప్ వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. తన స్నేహితురాలు అక్షిత రాజ్ను ఆకాశ్ వివాహం చేసుకొన్నాడు.
టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతడు టీమిండియాతో కలిసి ఐర్లాండ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ 2.0 వెలుగులోకి వచ్చాడు. అతడి తమ్ముడు మరో భారీ సెంచరీ చేశాడు.
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, వైభవ్కు అసలైన సవాలు ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ దుమ్మురేపాడు. అఫ్గానిస్థాన్తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచుల వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్ బ్యాటింగ్ విభాగంలో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు.