Home » Team India
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర పుటల్లో నిలిచే రోజు అతి దగ్గర్లో ఉంది. భారత్ తరఫున అంతర్జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసే అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్తో దూసుకుపోతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. తానియా ఛటర్జీ అనే నటి చేసిన సంచలన ఆరోపణల కారణంగా చాహల్ వార్తల్లో నిలిచాడు.
భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. 2026-27కు సంబంధించిన హోం సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే వన్డే మ్యాచులు తొమ్మిది ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు రాబోయే పర్యటనలకు సంబంధించి బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్లో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది.
భారత జట్టు వరుస విజయాల నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పదవీకాలాన్ని వన్డే ప్రపంచ కప్ 2027 వరకు పొడిగించాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం.
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్పై గెలిచిన టీమిండియా వరుసగా రెండో సారి ట్రోఫీని ఘనంగా ముద్దాడింది. అయితే పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే పాక్ జట్టు ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తీవ్ర విమర్శలు చేశాడు.
దక్షిణాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికాను తెలివితక్కువ జట్టుగా ఆయన అభివర్ణించాడు. సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే.. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేదని తెలిపాడు.
ఐసీసీ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్2026లో కూడా గ్రూప్ దశలో పాక్పై భారత్ విజయం సాధించింది.