Home » Team India
అండర్ 19 ప్రపంచ కప్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ను 37 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన కివీస్ 135 పరుగులకే ఆలౌటైంది.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో సూర్య చెలరేగి ఆడాడు. ఈ నేపథ్యంలో సూర్య ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. పేలవమైన ఫామ్లో ఉన్నప్పుడు తన భార్య దేవిషా శెట్టి ఇచ్చిన సలహా వల్లే తిరగి ఫామ్ అందుకున్నానని సూర్య చెప్పుకొచ్చాడు.
రాయ్పుర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 468 రోజులు, 24 ఇన్నింగ్స్ తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో సూర్య చక్కగా బ్యాటింగ్ చేశాడని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొనియాడాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
న్యూజిలాండ్తో రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది.
రాయ్పుర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 76 పరుగులతో చెలరేగి ఆడాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్పై ఇషాన్ మాట్లాడాడు. తన ప్రశ్నలన్నింటికీ సమాధానం పరుగులే అని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్ ఓకే గ్రూపులో ఉన్నాయి. ఈ క్రమంలో భారత్తో జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోతుందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రాయ్పూర్ వేదికగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడటం అనుమానమే.
బీసీసీఐ నేతృత్వంలో ఏర్పడిన క్రికెట్ జట్టును టీమిండియాగా అభివర్ణించకూడదని, ఈ మేరకు ప్రసార భారతికి ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాది రీపక్ కన్సల్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో జరుగుతోన్న మొదటి T20 మ్యాచ్లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ రికార్డులు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్పై తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత బ్యాటర్ గా, T20I లలో 25 బంతులు లేదా అంతకంటే తక్కువలో 8 హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్ అయ్యాడు.