IndW Vs SLW: మళ్లీ అదే తడబాటు.. భారత్ టార్గెట్ 129
ABN , Publish Date - Dec 23 , 2025 | 08:43 PM
విశాఖ వేదికగా శ్రీలంక-భారత రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన లంక.. 20 ఓవర్లకు 128 పరుగులు చేసింది. భారత్కు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖ వేదికగా భారత్-శ్రీలంక రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తొలుత లంకను బ్యాటింగ్కు ఆహ్వానించింది. శ్రీలంక బ్యాటర్లు ఆది నుంచే తడబడుతూనే వచ్చారు. తొలి టీ20 మాదిరిగానే.. ఈ మ్యాచులోనే స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేశారు. టీమిండియాకు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
విష్ని గుణరత్నే(1), హాసిని పెరెరా(22), కవిఖా దిల్హారి(14), నిలాక్షి డిసెల్వా(2), కౌశని నుత్యాంగణ(11), షాషని గింహాని(0), కాయా కవింది(1) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. చిమరి ఆటపట్టు(31), హర్షిత సమరవిక్రమ(33) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అరంగేట్ర మ్యాచులోనే వైష్ణవి శర్మ అదరగొట్టింది. వైష్ణవి శర్మ, శ్రీ చరణి తలో రెండు, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరొక వికెట్ పడగొట్టారు. గత మ్యాచులాగే ఇందులోనూ మూడు రనౌట్లు ఉండటం గమనార్హం.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్లో 5 వికెట్లు