Home » Team India
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్ను జయించిన విషయం తెలిసిందే. క్యాన్సర్తో బాధ పడుతూనే 2011 ప్రపంచ కప్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా క్యాన్సర్ నాటి రోజులను, తనకు ఎదురైన అనుభవాలను యువీ గుర్తు చేసుకున్నాడు.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మాజీ భారత వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప తీవ్రంగా స్పందించాడు.
న్యూజిలాండ్తో వన్డేల కోసం టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు. నెట్స్లో చెమటోడ్చుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను హిట్మ్యాన్ తన ఇన్స్టా స్టోరీలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ సూర్యకు ఓ సలహా ఇచ్చాడు. ఔట్ అవ్వడం గురించే కాకుండా పరుగులు రాబట్టడం గురించి ఆలోచించాలని తెలిపాడు.
ఆసియా కప్ 2025ఫైనల్ లో పాకిస్థాన్ ను ఓడించి భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విజయం సాధించి దాదాపు నాలుగు నెలలు గడిచినా టీమిండియాకు మాత్రం విన్నింగ్ ట్రోఫీ అందలేదు. తాజాగా ట్రోఫీపై ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
న్యూజిలాండ్తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన జట్టులో సీనియర్ పేసర్ షమీని ఎంపిక చేయలేదు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. శనివారం బీసీసీఐ న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించింది.
టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచులో రన్ తీస్తూ కింద పడ్డాడు. దీంతో అతడి పక్కటెముక విరిగినట్టు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు దూరమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్కు సంబంధించి బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అతడికి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించలేదు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు భారత్.. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో షమీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.