Home » Team India
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్మన్ గిల్ 85 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా గిల్ నిలిచాడు. ఇప్పటి వరకు గిల్ 2,757 పరుగులు చేశాడు. అతడి తర్వాత రిషభ్ పంత్ (2,731), రోహిత్ శర్మ (2,716), విరాట్ కోహ్లీ (2,617) ఉన్నారు.
కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన చిన్న తప్పిదంతోనే రనౌట్ గా జైశ్వాల్ 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అలా ఎవ్వరూ ఊహించని విధంగా తృటిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇన్నింగ్స్లో 92వ ఓవర్ను జైదెన్ సీలెస్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతిని యశస్వి మిడాఫ్ వైపు కొట్టాడు..
సాధారణంగా క్రికెటర్లు అంటేనే కొత్త కార్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఉత్సాహంగా లాంగ్ ట్రిప్ వేసుకొని మైండ్ని రిఫ్రెష్ చేసుకొని, పోటీకి సిద్ధం అవుతుంటారు. తాజాగా, టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ మరో కొత్త కారు కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం కొలంబోలో ఇండియాతో జరిగిన పోరులో పాకిస్తాన్ ఓపెనర్ సిద్రా అమీన్ చేసిన అతి ప్రవర్తన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆమె ప్రవర్తన లెవెల్ 1 నేరంగా గుర్తించబడింది.
కొలంబో వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో ఆరో మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 247 రన్స్ చేసింది. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ మాత్రం ఈ స్కోర్ బీట్ చేసేందుకు తెగ కష్టపడుతోంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, భారత్ను 50 ఓవర్లలో 247 పరుగులకు కట్టడి చేసింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రేమదాస మైదానంలో జరుగుతున్న మ్యాచులో భారత జట్టు స్లోగా ఆడుతోంది. ప్రస్తుతం వర్షం కారణంగా ఆటకు బ్రేక్ ఇచ్చారు. ఇండియా 154 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా కొలంబోలో భారత్, పాకిస్తాన్ మధ్య నేడు ఆరో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకున్న భారత జట్టు ట్రోఫీ లేకపోయినా తమ ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేసింది. ఆ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. కానీ పాకిస్థాన్ ఆటగాళ్లు.. భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేందుకు పలు మార్లు ప్రయత్నించారు. అయితే వాటిని ఎలా ఎదుర్కొన్నారని ఓ మీడియా ప్రశ్నించగా సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో బదులిచ్చారు.