Home » TDP
గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ను నమ్మి అనేకమంది ఇప్పుడు అధికారులు జైళ్లకు వెళ్లారని కొనకళ్ళ నారాయణ గుర్తు చేశారు. గత ఐదేళ్లల్లో మీ ధన దాహం కారణంగా ఇప్పుడూ అధికారులు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఏపీలో జగన్ పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
కష్టపడి పనిచేసిన నిజమైన టీడీపీ నాయకులను వేధిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. తాను ఎక్కడ ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా పెందుర్తి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
రమణి కుమారితో పాటు 200 మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రమణి కుమారితో పాటు మిగిలిన వారందరికీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించింది దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు.తనకు చదువు పట్ల అంతగా శ్రద్ధ ఉండేది కాదని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అరెస్ట్ చేసిన వారిలో పెద్దిరెడ్డి అనుచరుడు, వైసీపీ జిల్లా సెక్రటరీ యర్రబల్లి శ్రీను, చెన్నైకి చెందిన శరవణ ఉన్నారు. అలాగే.. పుంగనూరు మండలం బండపల్లెకు చెందిన శ్రీనివాస్, ప్రకాశ్, శ్రీనివాసరెడ్డి, తవనంపల్లె మండలం పట్నంకు చెందిన రమేష్, జేసిజి డ్రైవర్ సునీల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.
నందగోకులంలో పశువుల పరిరక్షణ, లైఫ్ స్కూల్, ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించడం తనకు కొత్త ఎక్స్పీరియన్స్ అని చంద్రబాబు తెలిపారు. 15,000 టన్నుల ధాన్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు.
NTTPS కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు కొసాగుతున్నాయని కూటమి నేతలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి మంటలు ఘటనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హస్తం ఉందంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. స్థానిక బొమ్మయపల్లి సర్పంచ్ గోవిందయ్య ఆడిన డ్రామాలో టీడీపీని బలి చేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి చివరకు అతనే అరెస్టయ్యాడని తెలుగు తమ్ముళ్లు పేర్కొన్నారు.
కల్తీ లిక్కర్ తయారీని ఉపేక్షించొద్దని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రమంతటా.. నకిలీ మద్యం అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని పేర్కొన్నారు.