Home » TDP
స్త్రీ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం భారంగా కాకుండా, బాధ్యతగా భావిస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
తనపై హత్య కుట్రకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియాల్లో ఎన్ని వీడియోలు పెట్టుకున్నా తనకేం భయంలేదని.. కానీ, ఓ పౌరుడిగా తనకు న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని... రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
సీఎం చంద్రబాబు సెప్టెంబరు 6న జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంగళ వారం స్థలాన్ని పరిశీలించారు. రాప్తాడు మండలం గంగలకుంట, రాప్తాడు ఆటో నగర్ వ
రెండు తెలుగు రాష్ట్రాలు వినాయక చవితి శోభతో కళకళలాడుతున్నాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
కొన్ని రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతోనే తన హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసులో A5 గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు.
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి లక్షలమంది అర్హులకు పెన్షన్ తొలగించిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదైందంటేనే చర్చలు మొదలయ్యాయి. కానీ సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి, పార్టీ నాయకుడైనా ఉపేక్షించవద్దని ఆదేశించడం రాజకీయాల్లో మార్పుగా నిలిచింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పార్టీకి సానుకూల సంకేతమా? వివాదాలకు తెరలేపే అంశమా అనే చర్చ సాగుతోంది.
తిరుపతి-తిరుమల నడుమ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు చేసిన ప్రకటన మహిళా యాత్రికులను మహదానందానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉచితంగానే తిరుపతికి చేరుకున్నా తిరుమలకు మాత్రం చార్జీలు చెల్లించాల్సిరావడం వీరిని అసంతృప్తికి గురిచేసింది. తాజా నిర్ణయం అమలు తేదీ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి తిరుమలకు ఉచితం చేయడం వల్ల ఆర్టీసీ మీద పడే భారం కూడా ఏమంత ఎక్కువ కాదు.
ఈనెల 30వ తేది కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చి స్వాగతించనున్నట్లు హెచ్ఎన్ఎ్సఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్ తెలిపారు.