Home » Tamil Nadu
తమిళనాడులో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా టీవీకే పార్టీలో చేరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడులోని మధురై నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలో 17 ఏళ్ల యువకుడిని ఆదివారం అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తమిళనాడులో డీఎంకే వల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని, విజయ్ సారథ్యంలోని టీవీకేతో చేతులు కలిపి తమకు వెన్నుపోటు పొడిచిందని ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. డీఎంకే కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తమ పార్టీ వెన్నంటే ఉందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే త్వరలో రాజ్యసభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 26 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది.
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సరకుల కోసం బయటకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించబోమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సుదీర్ఘకాల మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య చెడిన బంధం.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది.
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం శుక్రవారంనాడు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపింది. ప్రభుత్వంలో మరో ఇద్దరికి చోటు కల్పించింది. టీవీకేకు బయట నుంచి మద్దతిస్తామని ఇంతకుమందు ప్రకటించిన విడుదలై చిరుతైగళ్ కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధికార కూటమిలో చేరాయి.
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించారు.
వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం తాంబరం-సంత్రాగచ్చి, తాంబరం-బోడినాయకనూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
తమిళనాడు మంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లను ఎమ్మెల్యే ఎస్ రాజేశ్ కుమార్ ప్రస్తావించడంపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు.