Home » Tamil Nadu
చెన్నైలోని క్వాయిడ్-ఇ-మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాల మంగళవారం జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అందజేసిన ల్యాప్టాప్లతో లబ్ధిదారులు చదువుకోవడం, ఇంటర్వ్యూలకు హాజరవడం జరుగుతోందని, ఇందుకు తాము గర్విస్తున్నామని చెప్పారు.
చెన్నై మహానగరంలో.. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులు గతంలో నగరంలో అందుబాటులో ఉండేవి. అయితే.. మళ్లీ వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి మళ్లీ వీటిని సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఎస్పైకి అన్నీతానై పెంచిన పినతల్లి మృతిని తట్టుకోలేక ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంటానంటూ.. వైద్య విద్యార్థినిని అనడంతో సవతి తల్లి హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. హర్షిణి (22) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని వేలాంకన్నికి వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వేలాంకన్ని ఆరోగ్యమాత ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. అయితే.. వీరి సౌకర్యార్థం హెలికాప్టర్ను ఏర్పాటుచేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
అస్సాం, కేరళ, రాజస్థాన్, తమిళనాడు-పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్కు సీనియర్ పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.
తమిళనాడు తమకు కీలక రాష్ట్రమని, ఇండియా కూటమి కీలకమైన కూటమి అని మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఇందులో కాంగ్రెస్ భాగస్వామిగా ఉందని, డీఎంకే కీలక భాగస్వామి అని చెప్పారు.
అంబుమణి రామదాస్తో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ, పీఎంకే చేరికతో కూటమి మరింత బలపడిందని, మరి కొన్ని పార్టీలు కూడా తమ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయన చెప్పారు. తమది విక్టరీ అలయెన్స్ అని ప్రకటించారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 9వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు.