Home » Tamil Nadu
తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతిచెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
శ్రీప్రియకు మరో వ్యక్తితో సంబంధం ఉందని బలరాం కొద్దికాలంగా అనుమానిస్తున్నాడు. సంఘటన జరిగిన రోజున బాలమురన్ హాస్టల్కు వెళ్లి ఆమెను తనతో రమ్మని కోరాడు.
భారీ వర్షాల కారణంగా తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు మరణించారని, మైలాడుతురైలో విద్యుదాఘాతంతో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మంతి రామచంద్రన్ చెప్పారు.
కండక్టర్పై లా విద్యార్థిని చెప్పుతో దాడి చేసిన సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. దీనిపై రవాణా శాఖ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే శాంతి భద్రతలు వైఫల్యం, అవినీతి, అవకతవకల్లో కూరుకుపోయిందని, అయితే ముఖ్యమంత్రి నుంచి సీనియర్ మంత్రులందరూ ఇలాంటి వినోదాల్లో తేలుతుండటం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.
దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో భారీ ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలు త్వరత గతిన కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
ఉత్తరాది వారికి తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు కల్పించడమేంటని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రశ్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాది వాసులకు ఓటు హక్కు కల్పిస్తే, రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు
డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని ఆపార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. కరూర్ లో హీరో, టీవీకే పార్టీ నేత విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ సభలకు ముందస్తు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి రైతు కాదు... ద్రోహి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. మరొకొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.