Home » Tamil Nadu
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేసేలా నియోజకవర్గానికి డీఎంకే రూ.20కోట్లు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆరోపించారు.
రాష్ట్రంలో మరికొద్ది రోజేల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు.
తమిళగ వెట్రి కళగంతో బీజేపీ పొత్తు అవకాశాలు, రాజకీయాల్లో విజయ్ ప్రభావం ఏమేరకు ఉండనుందనే అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈసారి నేను అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని, డీఎండీకే పార్టీ ఫీనిక్స్ పక్షి లాంటిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు. ఆమె మాట్లాడుతూ... పడిలేచిన కెరటంలా మళ్ళీ పైకొస్తుందని ఆమె అన్నారు. కొద్దిరోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
చార్మినార్ ఎక్స్ప్రెస్ సహా మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్ స్టేషన్ నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
మహాబలిపురంలో ఆదివారంనాడు జరిగిన పార్టీ స్ట్రాటజీ మీటింగ్లో విజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుమారు 3,000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందీ వ్యతిరేక ఆందోళన 1965లో తారాస్థాయికి చేరినప్పటి వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్టాలిన్ ఆదివారంనాడు పోస్ట్ చేశారు. 'భాషా అమరవీరుల దినోత్సవం: అప్పుడు, ఇప్పుడు హిందీకి ఇక్కడ చోటు లేదు' అని స్టాలిన్ రాసుకొచ్చారు.
తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. గురువారం టీవీకే పార్టీకి ‘ఈల’ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయనిధికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. గవర్నర్ ఆర్.ఎన్.రవి తన ప్రసంగాన్ని చదవకుండా మధ్యలోనే వాకౌట్ చేశారు.