Home » Tamil Nadu
ఆ రెండు రకాల కుక్కల్ని పెంచవద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పేర్కొంది. చూపరులకు భయం కలిగేలా మొరిగే పిట్బుల్, రాట్వీలర్ శునకాలను పెంచవద్దని జీసీసీ తెలిపింది. ఈ మేరకు అంతే కాకుండా ఈ రెండు రకాలకు చెందిన శునకాలను పెంచితే రూ.లక్ష చొప్పున జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం సొంత, పరాయి అనే తేడా లేకుండా ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బుకు ఇచ్చిన విలువ మనిషి ప్రాణాలకు ఇవ్వడం లేదు. బీమా డబ్బు కోసం కంటికి రెప్పలా సాకిన తండ్రినే హతమార్చారు ఇద్దరు తనయులు.
రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తం ఓటర్ల వివరాలను ప్రటించారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 97,37,832 ఓటర్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు.
ఎస్ఆర్ఎఫ్ మొదటి ఫేజ్లో మొత్తం 6,41,14,587 మంది ఓటర్లకు గాను రికార్డు స్థాయిలో 5,43,76,755 ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పించారని, ఓటర్ల పార్టిషిపేషన్ 84 శాతం ఉన్నట్టు తమిళనాడు సీఈఓ కార్యాలయం తెలిపింది.
రాష్ట్రంలో.. ల్యాప్లాప్లు పంపిణీ చేయడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఫిబ్రవరిలోగా 10లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయాలన్నదే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఓట్ల కోసమే ల్యాప్లాప్లు పంపిణీ చేస్తున్నారని వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్తో ఎవరినీ పోల్చలేమంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. మరికొద్ది రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది.
మరికొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటీనటులకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజపాళయంలో గౌతమి, మైలాపూరు నుంచి గాయత్రి రఘురామ్ పోటీచేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు వారు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కమల్హాసన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమని, అన్నాడీఎంకేకు ఓటమి తప్పదని కమల్ అన్నారు.
నా విజయం వెనుక భార్య త్యాగం ఉంది.. ఇల్లాలి మాటను భర్త శిరసావహించాలి.. అని అన్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. భార్య చెప్పే మంచిమాటలను భర్త శిరసావహించాలని, అప్పు డే అన్యోన్య దాంపత్యం సాగుతుందన్నారు. కొళత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అందరూ చిన్నమ్మగా పిలిచే శశికళ దారెటు.., ఆమె నిర్ణయం ఏమిటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరో కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో.. ఆమె ఎవరికి మద్దతుగా నిలుస్తారో అన్ని పలువురు చర్చించుకుంటున్నారు.