Home » Tamil Nadu
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే హామీల వర్షం కురిపించింది. నేరుగా ఆర్థిక సాయం, సబ్సిడీల పెంపు, రుణాల మాఫీ, నిరుద్యోగులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చిరు వ్యాపారాలను ఆదుకోవడం వంటి కీలక హామీలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు.
ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ప్రబలుతోందని వస్తున్న వార్తలతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద పర్యవేక్షణ తీవ్రతరం చేశారు.
రాజకీయాల్లోకి రాకముందు ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడెన్ని ఆస్తులున్నాయో వెల్లడించాలని విజయ్ సవాలు చేశారు. వేలూరులో సోమవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తికావడంతో తుది జాబితాను ఎన్నికల సంఘం సోమవారంనాడు విడుదల చేసింది. సవరించిన జాబితా కింద రాష్ట్రంలోని 74 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీవీకే చీఫ్ విజయ్ (Vijay) ఉత్తర చెన్నైలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ కార్యదర్శి ఆధవ్ అర్జున ఆదివారంనాడు తెలిపారు.
పురపాలక మంత్రిత్వ శాఖలో లంచం తీసుకుని ఉద్యోగ నియామకాలు జరిగా యనే ఆరోపణలు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) అందించిన ఆధారాల ప్రకారం నగరపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ తదితరులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఏసీబీకి మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
నగరంలో గుర్రాలు, గాడిదలు పెంచడానికి తప్పకుండా కార్పొరేషన్ నుంచి లైసెన్స్లు పొందాల్సి ఉంటుందని గ్రేటర్ చెన్నై మేయర్ ఆర్ ప్రియా ప్రకటించారు. రిప్పన్భవనం సమావేశ మందిరంలో మేయర్ ప్రియ అధ్యక్షతన శుక్రవారం కార్పొరేషన్ సాధారణ సమావేశం జరిగింది.
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. సీఎం స్టాలిన్ తో మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్) భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం స్టాలిన్కు ఓపీఎస్ మద్దతు తెలిపారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. చెన్నైలో సీఎం స్టాలిన్ను మాజీ సీఎం పన్నీర్ సెల్వం కలిశారు. ఈ సందర్భంగా డీఎంకే 5 ఏళ్ల పాలనపై పొగడ్ల వర్షం కురిపించారు.
సంపన్నులకు ఉచితాలెందుకు? అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్ అందించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందే ఉచిత పథకాలను ప్రకటించే సంస్కృతిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.