Home » Tamil Nadu
ఆన్లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో, ఏడేళ్ల కుమారుడి గొంతు నులిమి హతమార్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, గొంతు కోసిన స్థితిలో ఆయన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా వున్నాయి...
కరూర్ రోడ్షోలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోవటానికి, వందమందికిపైగా గాయపడటానికి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్నే కారణమని ‘నామ్ తమిళర్ కట్చి’ (ఎన్టీకే) సమన్వయకర్త సీమాన్ ఆరోపించారు.
వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటల్లో కంకులు మొలకెత్తినట్లే, రాష్ట్ర ప్రజల్లో డీఎంకే పాలనపై తీవ్ర వ్యతిరేకత మొలకెత్తి, పెరిగి పెద్దదై పాలకులను ఇంటికి సాగనంపటం ఖాయమైపోయిందని ‘తమిళగ వెట్రి కళగం’ నాయకుడు విజయ్ జోస్యం చెప్పారు.
తేనాంపేట పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు మొదటి మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పూర్వం సిద్ధాంతపరంగా వేర్వేరు మార్గాల్లో పయనించినా ప్రస్తుతం దేశ సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ఒకే కూటమిలో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. మతత్త్వపార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలూ సమైక్యంగా పోరాడుతున్నాయని చెప్పారు.
ఊటీలో వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిన, పర్యాటక వాహన డ్రైవర్లకు రూ.26,400 జరిమానా విధించారు. నీలగిరి జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా యంత్రాంగం, లీటరు, రెండు లీటర్ల వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ బాటిల్స్ తదితర ప్లాస్టిక్ వస్తువులను నిషేధం విధించింది.
గత నెలలో కరూర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు విజయ్ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబీకులను వారిళ్లకే వెళ్లి పరామర్శించడానికి రాలేకపోయినందుకు తీవ్ర భావోద్వేగంతో క్షమాపణ అడిగారు. కరూర్లో రోడ్షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబ సభ్యులను, గాయపడినవారిని విజయ్ పరామర్శించారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల మళ్ళీ డీఎంకే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుం దని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్) జోస్యం చెప్పారు. శివగంగ జిల్లా కాళయార్కోవిల్లోని స్వాతంత్య్ర సమర యోధులు మరుదుపాండియర్ స్మారక స్థలంలో గురుపూజ సందర్భంగా సోమవారం నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్న ‘మొంథా’ తుఫాన్.. తమిళనాడులో గుబులు పుట్టిస్తోంది. దీని తీవ్రత భారీగా వుం టుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో. ఎటు నుంచి ఎటు వెళ్తుందోనని రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా వుండగా తుఫాను కారణంగా భారీ వర్షం పడే అవకాశముండడంతో మంగళవారం తిరువళ్లూర్ జిల్లాకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.
సెల్ఫోన్ వాడకం తగ్గించాలని తల్లిదండ్రులు మందలించడంతో ప్లస్ టూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. కడయాంపట్టి కరట్టుకోట ప్రాంతానికి చెందిన తంగరాజ్ కుమార్తె నివేద (17) కడయాంపట్టిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ప్లస్ టూ చదువుతోంది.