Home » Tamil nadu Assembly Elections 2026
తమిళనాట రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే అధినేత విజయ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని TVK అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే పార్టీల మధ్య శత్రుత్వం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. కరుణానిధిపై కోపంతోనే నటుడు ఎమ్జీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. అప్పట్నుంచి ఆ రెండు పార్టీల మధ్య శత్రుత్వం కొనసాగుతోంది.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. 108 సీట్లు సాధించిన విజయ్ 'టీవీకే' అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కోసం ఆ పార్టీ ముఖ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇండియా కూటమి ముఖ్య భాగస్వామి కాంగ్రెస్ టీవీకే పార్టీతో పొత్తుకు సిద్ధం కావడంపై డీఎమ్కే పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్కు ఆ హక్కు ఉందని డీఎమ్కే ఎంపీ కనిమొళి పేర్కొనగా పార్టీ ప్రతినిధి అన్నాదురై మాత్రం కాంగ్రెస్ నిర్ణయాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు.
ఎన్నికలకు ముందు డీఎంకేతో పొత్తుతో కాంగ్రెస్ పోటీ చేసి 5 స్థానాల్లో గెలిచింది. అయితే ఎన్నికల అనంతరం టీవీంకేతో జత కట్టింది. తాజా పరిణామాలపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులకు ఎక్కడ పొంతన లేదని ప్రజలు చెప్పుకొని పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
ఓటమి నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. స్టాలిన్ రాజీనామాను గవర్నర్ వెంటనే ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు.
తమిళనాడులో లాటరీ వ్యాపారం ప్రారంభించి వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబం తాజా ఎన్నికలలో అద్భుతం చేసింది. మార్టిన్ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, మూడు పార్టీల తరఫున పోటీ చేసి, గెలుపొందారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఎక్కువ సీట్లు సాధించి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం టీవీకేకు రాలేదు.