Home » Tadipatri
ఇద్దరి పంతం తాడిపత్రి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. తాడిపత్రిలో ఆడుగుపెట్టాలని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుని తీరాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పంతం పట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత హింస చెలరేగి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.
పాఠశాలలు వదిలిన సమయంలో విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్తున్న బస్సు డ్రైవర్ల తీరుపై గురువారం మండల కేంద్రంలో వారి తల్లిదండ్రులు, స్థానికులు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం పాఠశాలలు వదిలిన సమయంలో యాడికి నుంచి తాడిపత్రి, నిట్టూరు వైపు వెళ్లే విద్యార్థులు బస్సుల కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నారు.
JC Prabhakar Reddy: తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటుచేసుకునే ఉంటుంది. వైసీపీ హయాంలో తనను అన్యాయంగా జైలుకు పంపించారని జైసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్ణణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్ద ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
పరిశ్రమలు బాగుపడాలంటే విద్యుత చార్జీలు తగ్గించి, రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట తాడిపత్రి నియోజకవర్గంలో సాగు, తాగునీరు ఇబ్బందిలేకుండా మంచి పంటలు పండేవన్నారు.
ఎ.కొండాపురం శివారులోని కొండప్రాంతంలో మట్టి తవ్వకాలను సర్పంచు వనజమ్మ ఆధ్వర్యంలో చంద్రదండు నాయకులు గురువారం అడ్డుకున్నారు. ఎక్స్కవేటర్లు, టిప్పర్లను నిలిపివేశారు. మట్టి అక్రమ తవ్వకాలతో ఎ.కొండాపురం, అరకటవేముల, సూరేపల్లి గ్రామాల పరిధిలో కొండలు కనుమరుగు అవుతున్నాయని చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకా్షనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. తవ్వకాలు కొనసాగితే కొండ.....
సైబర్ నేరాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని ఎస్ఐ జనార్ధననాయుడు అన్నారు. పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపైన ఆటోల ద్వారా అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి చక్రస్థాపన భీమలింగేశ్వరస్వామి మాఘమాసం సందర్భంగా మూడో ఆదివారం జరగనున్న తిరునాళ్ల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్రెడ్డి పరిశీలించారు.
తాడిపత్రి మండలం నందలపాడు గ్రామంలో ఆంజనేయస్వామి మాన్యం భూమిలో నివాసముంటున్న కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. వారు బుధవారం జిల్లా కేంద్రంలోని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.