Home » Tadipatri
మండలంలోని గాండ్లపాడు గ్రామంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్తతో సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది. చెత్త సంపద తయారీ కేంద్రం ఉ న్నా చెత్తాచెదారాన్ని గ్రామస్థులు ఆరు బయట గ్రామ సమీపంలోనే వేస్తున్నారు.
రాయలచెరువు రైల్వేస్టేషనలో ధర్మవరం ఎక్స్ప్రెస్, ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మండలవా సులు వినతిప త్రం అందజేశారు. అనంతపురంలోని కార్యాలయంలో ఎంపీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భగత్సింగ్ నగర్లోని తన నివాసం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
ప్రజా సమస్యల పరి ష్కారం కోసం సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు(పీజీఆర్ఎస్)కు చాలా మంది అధి కారులు డుమ్మా కొట్టారు. ప్రతి సోమవారం ఇలాగే ఉందని, దీంతో పెం డింగ్లో ఉన్న పనులు, సమస్యలు తీరడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
అనాథ లుగా మారిన చిన్నారులకు ట్రాన్సకో ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ రవిశంకర్ రూ.20వేలు నగదు అందజే శారు. మండలంలోని పెద్దపేటకు చెందిన పల్లా శివ ప్రసాద్, భార్య హేమావతి చేతిలో హత్యకు గు రికావడం, హేమావతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి నలు గురు పిల్లలు అనాథలుగా మారారు.
యోగావల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతాయని, యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. అంత ర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర - 2026లో భాగంగా గురువారం జిల్లా పర్యాటకశాఖ, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంగ ణంలో టూరిజం డెస్టినేషన యోగా కార్యక్రమం నిర్వహించారు.
మండలకేంద్రంలో ఆధార్కేం ద్రాలు పనిచేయక పోవడంతో ఆధార్కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం విద్యార్థులు, బయోమెట్రిక్ కోసం ఉపాధి కూలీలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాడికిలో పలు సచివాలయాలు, పోస్టాఫీ సుతో పాటు ప్రైవేట్ ఆధార్ కేంద్రాలు ఉన్నాయి.
నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అరాచ కాలు, దౌర్జన్యాలు తగ్గలేదని, దీనిపై అనంతపురంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వెళ్లి ఎస్పీకి వివరించేం దుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మా జీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు.
నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నివా సంలో ఆయన శనివారం చింతల వెంకట రమణస్వామి క్లస్టర్ అభివృద్ధి పథకం కింద 180మంది చేనేత కార్మికులకు రూ.49లక్షల విలువవై న పనిముట్లను పంపిణీ చేశారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు జేసీ సిద్ధమయ్యారు.