Home » Stock Market
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సూచీలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఒప్పందం కారణంగా మంగళవారం లాభపడిన సూచీలు బుధవారం కూడా అదే జోరులో ప్రారంభమయ్యాయి. భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.
వరుస నష్టాలతో సతమతమైన దేశీయ సూచీలకు ఇండియా-యూకే ట్రేడ్ డీల్ భారీ బూస్టింగ్ ఇచ్చింది. గత వారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే 800 పాయింట్లకు పైన లాభపడ్డాయి.
వరుస నష్టాల నుంచి గురువారం కాస్త కోలుకున్న సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. విదేశీ మదుపర్లు గురువారం 2,549 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్గా మారింది.
వరుస నష్టాలతో సతమతమవుతున్న దేశీయ సూచీలు గురువారం కాస్త ఊరట కలిగించాయి. భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాలతో రోజును ముగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలను ఆర్జించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల సెంటిమెంట్లు మార్కెట్ను భారీగా దెబ్బతీస్తున్నాయి.
వరుస నష్టాలతో సతమతమవుతున్న దేశీయ సూచీలు మంగళవారం మరింత భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయింది. ఐరోపా దేశాలతో అమెరికా ట్రేడ్ వార్కు దిగడంతో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి.
కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఎఫ్ఎమ్సీజీ సెక్టార్ ఆకర్షణీయంగా మారడం, ఈయూ-భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో కదలిక కారణంగా సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అయినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతోనే రోజును ముగించాయి.
కోకా-కోలా తన భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ను పబ్లిక్ ఇష్యూకు తీసుకురాబోతోంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.9,027 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కంపెనీ విలువ సుమారు రూ. 90,000 కోట్లు ఉండే లక్ష్యంగా నిర్దేశించుకుంది.
గత కొన్ని సెషన్లుగా వరుస నష్టాలనే చూవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు బుధవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయంగా అనుకూల సంకేతాలు, కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి.
ఇరాన్తో వాణిజ్యం చేస్తున్న దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడం సూచీలకు నెగిటివ్గా మారింది. మరోవైపు డాలర్తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం కూడా స్టాక్మార్కెట్ల నష్టానికి ఒక కారణంగా మారింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.