Home » Stock Market
భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఏటా దీపావళి రోజున గంటపాటు ముహూరత్ ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తాయి. ఈ సారి దీపావళి విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. వాస్తవానికి దీపావళిని అందరూ సోమవారం (అక్టోబర్ 20) జరుపుకుంటున్నారు.
దీపావళి పండుగలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ‘బలిప్రతిపాద’ను పురస్కరించుకుని బుధవారం స్టాక్ మార్కెట్కు సెలవు ఉండనుంది.
వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు దూకుడుగా ముందుకెళ్లాయి. విదేశీ మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపడం పాజిటివ్గా మారింది. త్వరలో వెల్లడి కానున్న త్రైమాసిక ఫలితాలపై ఆశాజనకంగా ఉండడం కూడా ఈ రోజు మార్కెట్లకు కలిసొచ్చింది.
వరుస నష్టాలతో సతమతమైన దేశీయ సూచీలు ఎట్టకేలకు లాభాలను ఆర్జించాయి. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఆ ప్రభావంతో గత సెషన్లలో దేశీయ సూచీలు నష్టాలతోనే ముగిశాయి.
స్టాక్ మార్కెట్లో వీక్లీ ఆప్షన్స్ను దశలవారీగా రద్దు చేయాలని SEBI భావిస్తోంది. మొదట్లో వీటిని.. మార్కెట్లో లిక్విడిటీని పెంచడానికి, షార్ట్-టర్మ్ హెడ్జింగ్ కోసం తీసుకొచ్చారు. అయితే, వీటిని ఇప్పుడు క్విక్ స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం ఉపయోగిస్తున్నారు.
చైనా-అమెరికా ట్రేడ్ వార్ అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అమెరికా మార్కెట్లు కూడా నష్టపోతున్నాయి. ఆ ప్రభావంతో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలతోనే ముగిశాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధం ముగియడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపినప్పటికీ, చైనా-అమెరికా ట్రేడ్ వార్ ఆందోళన కలిగించింది. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి.
చైనాపై ట్రంప్ సుంకాల హెచ్చరికలతో దేశీ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడింది. ఊహించినట్టుగా దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
బుధవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫైనాన్సియల్ రంగంలో అమ్మకాలు సూచీలకు నెగిటివ్గా మారాయి. దీంతో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ఒక దశలో 82 వేల మార్క్ దాటిన సెన్సెక్స్ మళ్లీ కిందకు దిగి వచ్చింది.
వరుసగా ఐదో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. మెటల్, ఫైనాన్సియల్ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 82 వేల మార్క్ దాటేసింది. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగుతున్నప్పటికీ నిఫ్టీ 25 వేల మైలురాయిని చేరుకోవడం విశేషం.