Home » Stock Market
డాలర్తో పోల్చుకుంటే రూపాయి మరింత కుంగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (మంగళవారం) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఐటీ (IT) రంగంలోని షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగడంతో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభాలతో ప్రారంభమై భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. చివరకు మళ్లీ లాభాలతో రోజును ముగించాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలో నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
వరుసగా మూడు రోజుల పాటు లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం భారీ పతనాన్ని చవి చూశాయి. భారీగా నష్టపోయాయి. వరుస లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం సూచీలను నష్టాల దిశగా నడిపించింది.
ఇవాళ భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటిగంట సమాయానికి 800 పాయింట్లకు పైగా పడిపోయింది. అదే సమయానికి నిఫ్టీ 230 పాయింట్లకు పైగా పతనమైంది.
దేశీయ సూచీలు వరుస లాభాలతో ఫుల్ జోష్లో ఉన్నాయి. విదేశీ మదుపర్లు కోనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు పాజిటివ్గా మారింది. మంగళవారం విదేశీ మదుపర్లు రూ.995 కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం కూడా కలిసి వస్తోంది.
దేశీయ సూచీలు ఓ మోస్తరు లాభాలతో రోజును ముగించాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది.
ఐటీ సెక్టార్లో అమ్మకాల కారణంగా గత వారం భారీగా నష్టపోయిన సూచీలు సోమవారం కాస్త కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాటలో సాగుతున్నాయి.
ఇటీవల భారీగా పెరిగి రికార్డు గరిష్ఠాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. సమీప భవిష్యత్తులో బంగారం ధర లక్ష రూపాయల లోపునకు చేరుకుంటుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు వెండి కూడా రోజూ తగ్గుదలనే నమోదు చేస్తోంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ విడుదలైన రిపోర్ట్ ప్రతికూలంగా మారింది. ఈ రిపోర్ట్తో ఐటీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐటీ రంగంలోని హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు ఓవరాల్గా స్టాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.