Home » Stock Market
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 22న) స్పల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో బెంచ్మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ50 సూచీలు దిగువకు పయనిస్తుండగా, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి.
అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ క్లియర్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.
హిండెన్బర్గ్ ఆరోపణలతో దేశవిదేశాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ కంపెనీలకు సెబీ క్లీన్చిట్ ఇచ్చింది. అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసాలు, స్టాక్ అవకతవకలకు పాల్పడుతోందని అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ చేసిన ఆరోపణలు నిజం కావని సెబీ తేల్చి చెప్పింది.
ఊహించినట్టుగానే యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించడం దేశీయ సూచీలకు బూస్టింగ్ ఇచ్చింది. అలాగే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మదుపర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
భారత స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ 18న కూడా లాభాల జోరును కొనసాగించింది. ఇది వరుసగా మూడో రోజు కావడం విశేషం. అమెరికా ఫెడ్ రిజర్వ్ తాజా నిర్ణయం ఈ జోరుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
మంగళవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం కూడా అదే జోరును కొనసాగించాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మదుపర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
భారత స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ 17న మరోసారి దుమ్మురేపింది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజు తమకు తాము సవాల్ విసిరినట్టు సరికొత్త గరిష్ఠాల్ని చేరాయి. ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ చర్చలు సానుకూల దిశగా సాగాయన్న సంకేతాలతో ఇన్వెస్టర్ల ఉత్సాహం పెరిగింది.
సోమవారం స్వల్ప నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం విజృంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించనుందనే అంచనాలు సూచీలను ముందుకు నడిపించాయి.
గత వారం వరుస లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలను చవిచూశాయి. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం లాభాలను ఆర్జించాయి.
గత మూడు రోజులుగా వరుస లాభాలు అందుకుంటున్న దేశీయ సూచీలు గురువారం కాస్త నెమ్మదించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రకటించనుండడంతో పాటు, శుక్రవారం దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కాబోతుండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.