Share News

భారీ నష్టాలను చవిచూస్తోన్న భారత స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:55 PM

ఇవాళ భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటిగంట సమాయానికి 800 పాయింట్లకు పైగా పడిపోయింది. అదే సమయానికి నిఫ్టీ 230 పాయింట్లకు పైగా పతనమైంది.

భారీ నష్టాలను చవిచూస్తోన్న భారత స్టాక్ మార్కెట్లు
Indian stock markets witnessed heavy losses

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: నేడు (ఫిబ్రవరి 19) భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సూచీలు భారీగా పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (SENSEX) ఏకంగా 800 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 83,969.82 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక దశలో 82,943.49 కనిష్ఠ స్థాయికి పడిపోయింది.


ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (NIFTY 50) కూడా 230 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఉదయం 10:12 గంటల సమయంలో 25,771 వద్ద ఉన్న నిఫ్టీ.. మధ్యాహ్నానికి మరింత బలహీనపడింది. స్టాక్ మార్కెట్లు నష్టపోతున్న తరుణంలో బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. మార్కెట్ కీలక సపోర్ట్ స్థాయిల కంటే కిందకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

For More National News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 01:04 PM