Home » Stock Market
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్ళీ కొత్త వారం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందుకు ఐదు పబ్లిక్ ఇష్యూలు రాబోతున్నాయి. ఈ సారి టాటా క్యాపిటల్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా సహా పలు కంపెనీల బ్రాండ్లు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
గత ఎనిమిది సెషన్లుగా వరుసగా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలకు ఆర్బీఐ రెపోరేట్ జోష్ అందించింది. ఆర్బీఐ రెపోరేట్ను మరోసారి యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడం మార్కెట్లకు కలిసొచ్చింది. బ్యాంకింగ్ సెక్టార్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
గత ఏడు సెషన్లుగా వరుసగా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలు మంగళవారం మాత్రం అదిరే లాభాలతో మొదలయ్యాయి. అయితే కాసేపటికి మళ్లీ కిందకు దిగి వచ్చాయి. ఐటీ స్టాక్స్లో అమ్మకాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. ఫైనాన్సియల్, మెటల్ రంగాలు మాత్రం లాభాలను అర్జిస్తున్నాయి.
ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ అద్భుతమైన జోష్లో ఉంది. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా కంపెనీలు భారీగా నిధులు సేకరిస్తున్నాయి. ఇక అసలు హైప్ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఎందుకంటే టాటా గ్రూప్ నుంచి మరో బిగ్ ఐపీఓ రాబోతుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారాన్ని సానుకూల ధోరణిలో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు నెగిటివ్గా ఉన్నప్పటికీ కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుడంతో లాభాల్లోకి వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ లాభాలు కరిగిపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు (సెప్టెంబర్ 26న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ల విషయంతో భారతీయ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. ప్రధానంగా ఫార్మా సెక్టార్ మీద పెద్ద దెబ్బ పడింది.
విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగుతుండడంతో దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నేల చూపులు చూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం, డాలర్తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం నెగిటివ్గా మారాయి.
అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఐటీ రంగ షేర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. అలాగే డాలర్తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం, ఇండియన్ ఈక్వెటీ మార్కెట్లు ఓవర్ వెయిట్ జోన్లో ఉన్నట్టు హెచ్ఎస్బీసీ ప్రకటించడంతో మదుపర్లలో ఆందోళన కలిగిస్తోంది.
సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు మంగళవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ రంగంలో అమ్మకాలు సూచీలు వెనక్కి లాగుతున్నాయి.
హెచ్1బీ వీసాల ఫీజును అమాంతంగా పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ సెక్టార్పై తీవ్ర ప్రభావం చూపనుందనే అంచనాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఐటీ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్లు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి.