Home » Sports
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ చెత్త ఫీల్డింగ్తో హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచ్ లో అతడిపై వేటు పడనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా విఫలమైంది. ఐదు సార్లు కప్ను ముద్దాడిన ఆసీస్.. ఈసారి గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒకదాంట్లోనే విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేపాల్-స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026.. ఇప్పటికే గ్రూప్ స్టేజి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. భారత్, జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. ఈ నేపథ్యంలో సూపర్ 8లో టీమిండియాతో తలపడే జట్లు ఖారారయ్యాయి.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరగాల్సి ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే పోరుకు తెరపడింది. పిచ్ క్యురేటర్లతో మాట్లాడి అంపైర్లు తమ తుది నిర్ణయాన్ని వెల్లడించారు.
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్లో లేడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడి.. రెండింట్లోనూ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ అంశంపై స్పందించాడు.
పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. టీమిండియా స్టార్ క్రికెటర్ దీప్తి శర్మను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్ వన్ బౌలర్గా తిరిగి తన స్థానాన్ని సంపాదించుకుంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కొంత కాలంగా జైలు జీవితం అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన కుడి కన్ను 85 శాతం చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి మెరుగైన చికిత్స అందించాలంటూ భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్.. పాక్ ప్రభుత్వాన్ని కోరారు.
భారత జట్టు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవులను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెంటర్ లేదా సీఈవో, స్టాటజిక్ పార్టనర్ పదవులను అతడికి రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ చేసినట్లు సమాచారం.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ 24 గంటలైనా గడవకముందే తన మాట మార్చాడు. తాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అధ్యక్షుడు, ఏసీసీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదంటూ యూ టర్న్ తీసుకున్నాడు.