Home » Sports
డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో ఉన్న 18 మ్యాచుల్లో టీమిండియా ఎనిమిది టెస్ట్లు ఆడేసింది. వీటిలో నాలుగు గెలిచి, మూడు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. మరి టీమిండియా ఫైనల్ చేరాలంటే ఇంకా ఎన్ని గెలవాలంటే..
బంగ్లాదేశ్ మహిళా జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ తన జూనియర్లను కొడుతుందని ఆ జట్టు పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుల్తానా తాజాగా స్పందించింది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో ఒక్క టెంబా బావుమా తప్పా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ క్రీజులో ఉండలేకపోయారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ఏటీపీ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో ఇటలీ స్టార్ యానిక్ సినర్ టైటిల్ గెలిచాడు. స్పెయిన్కు చెందిన స్టార్ ప్లేయర్ అల్కరాజ్ను ఓడించాడు. దీంతో వరుసగా రెండేళ్లు ఈ టైటిల్ అందుకున్న ఆటగాడిగా సినర్ రికార్డు సృష్టించాడు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్పై వస్తున్న విమర్శలపై పిచ్ క్యురేటర్ సుజన్ ముఖర్జీ స్పందించారు. భారత శిబిరం చెప్పినట్లుగానే పిచ్ తయారు చేశానని చెప్పాడు. టెస్టు మ్యాచ్లకు పిచ్ ఎలా సిద్ధం చేయాలో తనకు తెలుసని వెల్లడించాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ పిచ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది టర్నింగ్ ట్రాక్ అంటే తాను ఒప్పుకోనని వెల్లడించాడు.
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్కు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో కెప్టెన్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతారని కేఎల్ వెల్లడించాడు. సరైన ప్రదర్శన చేయకపోతే యజమానులు బోలెడు ప్రశ్నలు వేస్తారని తెలిపాడు.
సౌతాఫ్రికాతో టీమిండియా తొలి టెస్ట్ ఓడిపోవడంపై మాజీ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. టెస్టు క్రికెట్ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్వదేశంలోనే ఛేదించలేకపోవడం ఏంటని ప్రశ్నించాడు.
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డబ్ల్యూపీఎల్ కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. నాలుగో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగనున్నట్లు సమాచారం.
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో పసికూన హాంగ్కాంగ్పై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.