Home » Sports
అండర్-19 వన్డే ప్రపంచకప్లో ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ సూపర్-6లో భాగంగా తలపడనున్నాయి. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచింది.
తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదో టీ20లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టును తొలుత ఫీల్డింగ్కు ఆహ్వానించింది. కాగా ఈ ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా ఎలెనా రిబకినా నిలిచింది. అద్భుతమైన పోరాటంతో ఈ టోర్నీ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో బెలారస్కు చెందిన సబలెంకాపై 6-4, 4-6, 6-4 తేడాతో రిబకినా విజయం సాధించింది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, పేస్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ సరికొత్త రికార్డు అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్జున్ యాభై వికెట్ల క్లబ్లో చేరాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గోవా తరఫున అతడు మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
భారత్-న్యూజిలాండ్ జట్లు శనివారం తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో తలపడనున్నాయి. ఈ ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆఖరి పోరులో గెలిచి.. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026ను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది.
గత కొంతకాలంగా మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా వివిధ దేశాలతో ఆల్ఫార్మాట్ సిరీస్లు ఆడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో పాక్కు ఘోర అవమానం జరిగింది..
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ పరంగా సూర్యకు రావాల్సినంత క్రెడిట్ రావడం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్గా సూర్యకు అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. బ్యాటర్గా రాణించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. దీంట్లో స్టార్ ప్లేయర్లు చోటు దక్కించుకోలేకపోయారు. పాట్ కమిన్స్, స్మిత్ జట్టుకు దూరం కాగా.. మిచ్ మార్ష్ ఆసీస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ సుదీర్ఘ కెరీర్లో ఐదు సెట్ల సమరాలు ఎన్నింటిలోనో తలపడ్డాడు. కానీ ఈ ఐదు సెట్ల పోరు మాత్రం ఎంతో ప్రత్యేకం...
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ జట్లు వడోదర వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన గుజరాత్ బ్యాటర్లు రాణించారు. నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేశారు.