Home » Sports
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ అత్యంత సురక్షితమైన దేశమని, భారత్ తప్పకుండా తమ దేశానికి వస్తుందనే నమ్మకం ఉందని ఇక్భాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత హాకీ జట్ల కొత్త జెర్సీల అంశం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా ఉన్న నీలం రంగు స్థానంలో కాషాయం రంగు జెర్సీలను ఆవిష్కరించడంపై మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఈ వివాదంపై హాకీ ఇండియా స్పందించింది.
భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశాలు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్కూ అతణ్ని ఎంపిక చేయకపోవడంతో.. ఇక షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనన్న చర్చ జోరందుకుంది.
హాకి ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత పురుషుల, మహిళల జట్ల జెర్సీల రంగును మార్చింది. ఇప్పటి వరకు నీలం రంగులో ఉన్న భారత హాకీ జట్టు జెర్సీ.. ఇకపై ఆరెంజ్ రంగులో కనిపించనుంది.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో పాల్గొనే ముందు భారత జుడో జట్టుకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. భారత్ నుంచి గ్లాస్గోకు చేరుకున్న 16 మంది సభ్యుల జట్టులో పలువురు జుడోకాలకు చెందిన లగేజీ గమ్యస్థానానికి చేరకపోవడంతో ప్రాక్టీస్కు అంతరాయం ఏర్పడింది.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు మరోసారి సత్తా చాటారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, 66 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి సెమీఫైనల్కు అర్హత సాధించారు. భారత్కు మరో రెండు పతకాలు ఖాయం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ దాటిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది.
వన్డే ప్రపంచ కప్ 2027 నిర్వహణలో ఐసీసీ చేసిన మార్పులపై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్పందించాడు. జట్ల సంఖ్య పెంచినట్లే.. ఒక్కో జట్టులో ప్లేయర్ల సంఖ్య కూడా పెంచాలని ఐసీసీని కోరాడు.
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదానికి అభిమానులు ‘క్లిక్గేట్’, ‘క్లికీ పాంటింగ్’ అనే పేర్లు పెట్టారు. అసలు ఈ వివాదానికి ఆ పేర్లు ఎందుకు పెట్టారనే ప్రశ్న చాలామందిలో మొదలైంది.