Home » Sports
సాధారణంగా భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మైదానంలో క్రీడాకారులతో బిజీగా గడుపుతుంటాడు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ షోలో మోర్కెల్ మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కామన్వెల్త్ గేమ్స్ 2026 సంగ్రామం ముగిసింది. గ్లాస్గో వేదికపై భారత మహిళా అథ్లెట్లు అద్భుతం చేశారు. భారత్ సాధించిన 13 స్వర్ణాల్లో 8 గోల్డ్ మెడల్స్ మహిళా అథ్లెట్ల ఖాతాలోనే చేరడం విశేషం.
కామన్వెల్త్ గేమ్స్ 2026ను భారత్ 39 పతకాలతో అద్భుతంగా ముగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది మన క్రీడాకారుల అచంచలమైన సంకల్పం, క్రమశిక్షణ, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక విశేషమైన విజయమని పేర్కొన్నారు.
నీరజ్ చోప్రా.. ఒకప్పుడు అంతర్జాతీయ వేదికపై బరిలోకి దిగాడంటే స్వర్ణం ఖాయమైనట్లే అని అభిమానులు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఈ జావెలిన్ త్రో స్టార్ గోల్డెన్ మెడల్ను ముద్దాడి మూడేళ్లు గడిచిపోయింది. దీంతో అతడి కెరీర్ స్తబ్దతకు చేరిందా? లేక ప్రపంచ స్థాయి పోటీ మరింత పెరిగిందా? అనే చర్చ అథ్లెటిక్స్ వర్గాల్లో సాగుతోంది.
మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.
శ్రీలంకతో టెస్టు సిరీస్కు స్టార్ బౌలర్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో జమ్ముకశ్మీర్కు చెందిన యువ పేసర్ ఆకిబ్ నబీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో నబీకి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది.
భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ తనకు నచ్చిన టాప్-5 భారత బౌలర్ల జాబితాను వెల్లడించాడు. అయితే ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ జాబితాలో చోటు లేకపోవడం గమనార్హం.
టీమిండియా పురుషుల జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్గా అసోంకు చెందిన మాజీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ను బీసీసీఐ నియమించింది. పదవీకాలం పూర్తవడంతో టి.దిలీప్ ఇటీవల తన బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు వరుసగా అవకాశాలు ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా అసంతృక్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్లోనూ అతడికి అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే.