Home » Sports news
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ అవార్డు కోసం పలువురు భారత క్రికెటర్లు పోటీలో నిలిచారు. వారిలో పురుషుల విభాగంలో యువ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఉండగా, మహిళల విభాగంలో స్మృతి మంధాన నిలిచింది.
అమెరికాలో చెక్మేట్ ఇండియా వర్సెస్ యూఎస్ఏ ఎగ్జిబిషన్ చెస్ ఈవెంట్లో ఆదివారం చోటు చేసుకున్న ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది. అమెరికా గ్రాండ్మాస్టర్ హికారు నకమురా, భారత యువ వరల్డ్ చెస్ ఛాంపియన్ డి.గుకేష్ పై విజయం సాధించాడు. ఆ క్రమంలో ఆట ముగిసిన వెంటనే నకమురా రాజు (కింగ్) పీస్ను జనాల్లోకి విసిరాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, భారత్ను 50 ఓవర్లలో 247 పరుగులకు కట్టడి చేసింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రేమదాస మైదానంలో జరుగుతున్న మ్యాచులో భారత జట్టు స్లోగా ఆడుతోంది. ప్రస్తుతం వర్షం కారణంగా ఆటకు బ్రేక్ ఇచ్చారు. ఇండియా 154 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా కొలంబోలో భారత్, పాకిస్తాన్ మధ్య నేడు ఆరో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ ప్రతిభతో మళ్లీ మ్యాజిక్ చేశాడు. కేవలం 168 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసి, తన కెరీర్లో ఆరో సెంచరీని సాధించాడు.
జింబాబ్వే యువ ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ తన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ 21 ఏళ్ల ఆటగాడు 72 గంటల్లోనే రెండు ప్రపంచ రికార్డులు సృష్టించి అరుదైన ఘనతను సాధించాడు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్కు చెందిన 22 ఏళ్ల తిలక్ వర్మ పేరు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై తిలక్ చేసిన 69 పరుగులు, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే తిలక్ గతంలో ఆడిన టోర్నీలు ఏంటి, అతని ఫ్యామిలీ గురించి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకున్న భారత జట్టు ట్రోఫీ లేకపోయినా తమ ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేసింది. ఆ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.