Home » software
కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే.
ఇద్దరు పిల్లలతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చి 20 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు కేసు మిస్టరీ వీడలేదు.
అది చిత్తూరు నగరంలోని ఇరువారం సర్కిల్. కంటైనరు లారీకి అడ్డంగా శుక్రవారం ఉదయం 8.13.51 గంటలకు ద్విచక్ర వాహనం వచ్చింది. అప్పట్నుంచి నాలుగు సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయా రెడ్డి, ఆమె పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఓ సీనియర్ ఉద్యోగి కంపెనీ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ను దొంగిలించాడని కేసు నమోదైంది. ఈ డేటా విలువ సుమారు రూ.87 కోట్లుగా ఉంటుందని అంచనా. నిందితుడ్ని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ యాజమాన్యం.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బెంగళూరుకు చెందిన మేథా క్షీరసాగర్ వివాహం నవంబర్ 23న ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన సంగమ దాస్తో జరిగింది. ఇరువురూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్పూర్ కృష్ణానగర్కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి సుర్వి విశాల్గౌడ్(28), మల్లాపూర్లో నివాసం ఉండే నవ్య(25)తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షాకింగ్ న్యూస్ చెప్పింది. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పుల కారణంగా 2 శాతం మంది ఎంప్లాయిస్ అంటే, దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
ప్రేమ విఫలమై.. డ్రగ్స్కు బానిసైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ స్మగ్లర్గా మారాడు. గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ హెచ్న్యూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కథనం ప్రకారం.. గాజులరామారానికి చెందిన హర్షవర్థన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.