Home » Sircilla
మేడిపల్లి ఓపెన్కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తు న్నది. శనివారం రాత్రి గోదావరినది దాటి లింగాపురం గ్రామశ్మశానవాటిక సమీపంనుంచి మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాంతంలో ప్రవేశించింది. బొగ్గుఉత్పత్తి నిలిచిపో యిన తరువాత నాలుగేళ్లుగా వేలఎకరాల విస్తీర్ణంలో మేడి పల్లి ఓసీపీ ప్రాంతమంతా అడవిని తలపించేలా చెట్లుపెరిగాయి.
జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రత్యర్థులపై పై‘చేయి’ సాధించారు. మొదటి విడతలో జరిగిన మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ హవా రెండవ విడతలోనూ కొన సాగింది. కాంగ్రెస్ పార్టీ 51 స్థానాలు, బీఆర్ ఎస్ పార్టీ 14 స్థానాలు, స్వతంత్రులు 6 స్థానాల్లో, సీపీఐఎంఎల్ ప్రజాపంథా నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు గెలిచారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 111 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆయా గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోలింగ్ సామగ్రితో గ్రామాలకు చేరుకున్నారు.
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని జగిత్యాల, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 144 గ్రామ పంచాయతీలు, 1,276 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 10 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 330 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 134 సర్పంచ్ స్థానాలకు 521 మంది అభ్యర్థులు, 946 వార్డులకు 2,662 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరో ఘట్టం ఆదివారం ముగిసిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడత పోలింగ్, ఫలితాల వెల్లడికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. శనివారం మలి విడతలో ఎన్నికలు జరిగే తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయిన్పల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రితో పల్లెలకు చేరుకున్నారు.
జిల్లాలో ఈ నెల 14వ తేదీన జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రిని తమకు కేటాయించిన వాహనాల్లో తీసుకవెళ్లారు.
సింగరేణి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఆర్జీ-1 సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్కుమార్ పిలుపునిచ్చారు. శనివా రం ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో గోదావరి ఖనిలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, డ్యాన్స్ మస్టర్లు, సేవాసమితి సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
యాసంగి పంటల సాగు కోసం రైతన్నలు సమా యత్తం అవుతున్నారు. రైతులు వారి కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా వ్యవసాయ పనులతో పొలాల వద్ద బిజీ బిజీగా ఉంటున్నారు.
ప్రజలు నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావ రణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల పనితీరు ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి పోలీసు సిబ్బందికి సూచిం చారు. ఎన్నికల నిర్వహణపై శనివారం స్థానిక గౌతమీబుద్ద ఫంక్షన్హాల్లో సిబ్బం దికి సమావేశం ఏర్పాటు చేసి పలు సూచన లను, సలహాలు ఇచ్చారు.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) కేంద్ర కార్యాలయాన్ని నోయిడా నుంచి రామగుండానికి తరలించాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఫెర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎంపీ బలరాంనాయక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం శాసన సభ్యుడు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయినా కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఆర్ఎఫ్సీఎల్లో వరుస సాంకేతిక అవరోధాలతో ప్లాంట్ షట్ డౌన్ అవుతుంది.