Home » Sircilla
బక్రీద్ పండుగను పురస్కరిం చుకుని పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవా రం దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రాముగుండం సీపీ తనిఖీ చేశారు.
రామగుండం కార్పొ రేషన్ పరిధిలో కాల్వలపై నిర్మించిన అక్రమ నిర్మాణా లను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఎమ్మెల్యే మక్కా న్సింగ్ రాజ్ఠాకూర్ సూచించారు. వార్దు సందర్శనలో భాగంగా బుధవారం మేయర్ మహంకాళి స్వామితో కలసి అశోక్నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాలలో పర్యటించారు.
బీహార్, ఉత్తర ప్రదేశ్లకు అత్యధిక నిధులు ఇచ్చి, తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోత పెడుతున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బుధవారం పెద్దపల్లి ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అత్యధిక పన్ను తెలంగాణ నుంచే కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంటే రాష్ట్రానికి మాత్రం ఇస్తున్న నిధుల్లో అన్యాయం జరుగుతుందన్నారు.
ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్ళానని, నిధుల కేటాయింపునకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం డీఎంఎఫ్టి నుంచి రూ.కోటి వ్యయంతో ఆలయ నుంచి కొమిర వరకు నిర్మించనున్న సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కొనుగోళ్ళలో ఎలాంటి కటింగ్లో ఉండొద్దని, కేంద్రాల నుంచి రైస్మిల్లులకు వస్తున్న ధాన్యం లారీలను 24 గంటల్లో అన్లోడ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మిల్లర్లను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాలలో ఉన్న రైస్మిల్లులను బుధవారం తనిఖీలు చేశారు.
క్యాన్సర్పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని ఆర్జీ-1 సింగరణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్కుమార్ అన్నారు. మంగళవారం జీవీటీసీ ఆవరణలో మహిళలకు క్యాన్సర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
విద్యా ర్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు లను మంగళవారం రాత్రి క్యాంపు కార్యాల యంలో సన్మానించారు.
జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కల నిల్వకు గోదాములను సిద్ధం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రంగాపూర్లో 5వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోదాం సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం కలెక్టర్ రంగా పూర్లో గోదాములను, అప్పన్నపేటలోని ఎస్ఆర్ఆర్ రైస్మిల్ను తనిఖీ చేశారు.
పెద్దపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం సబ్బితంలో రూ. 6 కోట్లతో గౌరి గుండాల జలపాతం అభివృద్ధి పనులకు, గౌరెడ్డిపేటలో రూ. 43లక్షలతో ప్లాస్టిక్ వ్యర్థాల మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణానికి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యేచింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు.
రౌడీషీటర్లు తీరు మార్చుకోకపోతే పీడీ యాక్టు అమలు చేస్తామని గోదావరిఖని ఏసీపీ రమేష్ హెచ్చరించారు. సోమవా రం వన్టౌన్ పోలీస్స్టేషన్లో సబ్ డివిజన్ రౌడీషీ టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.