• Home » Sircilla

Sircilla

అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు

అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు

అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నా రు. సోమవారం పెద్దబొంకూరులో రూ.2.40 కోట్లతో నిర్మించిన హై లెవెల్‌ వంతెన, రూ.12 కోట్లతో నిట్టూరు నుండి కాచాపూర్‌ వరకు బీటీ రోడ్డును ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు ప్రారంభించారు.

బైపాస్‌ సర్వే పనులను అడ్డుకున్న రైతులు

బైపాస్‌ సర్వే పనులను అడ్డుకున్న రైతులు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రమాదాల నివారణకు చేపడుతున్న బైపాస్‌ రోడ్డు సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. ముందుగా శిలాఫలకం వేసిన మేరకు గాకుండా, మరో చోట నుంచి రోడ్డును నిర్మించాలని చూస్తుండడం వల్ల తాము భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని భావిస్తున్న రైతులు సోమవారం పురుగు మందు డబ్బాలతో నిరసన చేపట్టడంతో పాటు రాజీవ్‌ రహదారిపై పడుకుని రాస్తారోకో చేశారు.

ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ ప్రసాదరావు అన్నారు. ఆదివారం పలు గ్రామాల్లో బీఎల్‌ఓలు ఓటర్లకు ప్రత్యేక నమోదు ఫారాలను అందించారు.

బీసీల హక్కుల సాధనకు ఏకంకావాలి

బీసీల హక్కుల సాధనకు ఏకంకావాలి

హక్కు ల సాధన కోసం బహుజన వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాలని బీసీ జేఏసీ చైర్‌పర్సన్‌ దాసరి ఉష పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంట లకు పెద్దపల్లిలోని ఆర్యవైశ్య భవనంలో బీసీల ఆత్మీ య సమావేశం మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

ఆర్యవైశ్యులు ఒక్కతాటిపై ఉండాలి

ఆర్యవైశ్యులు ఒక్కతాటిపై ఉండాలి

ఆర్యవైశ్యులంతా ఒకేతాటిపై ఉండాలని మాజీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి ఆర్యవైశ్య సంఘ భవనంలో పట్టణ అధ్యక్షుడిగా ఒజ్జల సదానందం, ప్రధాన కార్యదర్శిగా వెలిశాల రాజశేఖర్‌, గౌరవ అధ్యక్షులుగా కేశెట్టి రవీందర్‌, మండల అధ్యక్షులుగా కాసనగొట్టు విజయ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.

పోలియోరహిత తెలంగాణే లక్ష్యం

పోలియోరహిత తెలంగాణే లక్ష్యం

పోలియోరహిత తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, పోలియో చుక్కలు చిన్నారికి రక్షణ అని ఎమ్మెల్యే, విప్‌ చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ప్రతి ఉద్యోగి రక్షణ నియమాలను పాటించాలి

ప్రతి ఉద్యోగి రక్షణ నియమాలను పాటించాలి

ఎన్టీపీసీ లో పటిష్టమైన భద్రత వ్యవస్థను అమలు చేస్తున్నామని రామగుం డం, తెలంగాణ ఎన్టీపీసీ ఈడీ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. జాతీయ ఎలక్ర్టికల్‌ సేఫ్టీ వారోత్సవాలను శుక్రవా రం తెలంగాణ ప్రాజెక్టు ఆవరణలో ప్రారం భించారు.

డ్రగ్స్‌రహిత సమాజ నిర్మాణంలో     భాగస్వాములు కావాలి

డ్రగ్స్‌రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

డ్రగ్స్‌ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగ స్వాములు కావాలని డీసీపీ రాంరెడ్డి పిలుపుని చ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ నరేష్‌ ఆధ్వర్యంలో కళాశాల మైదానం నుంచి జెండా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి అవగా హన ర్యాలీ నిర్వహించారు.

గోదావరిని ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వం

గోదావరిని ఎడారిగా మారుస్తున్న ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందళ్ళ బ్యారేజీల గేట్లు ఓపెన్‌ చేసి పెట్టి గోదావరి నదిని ఎడారిగా మార్చిన పాపం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబులదేనని మాజీ ఎమ్మల్యే పుట్ట మధు ఆరోపించారు.

రెండేళ్లలో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

రెండేళ్లలో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

రానున్న రెండేళ్లలో మండలంలోని ప్రతీ గ్రామంలో పార్టీలకతీతంగా అభి వృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజ యరమణరావు అన్నారు. శుక్రవారం జీలకుంటలో రూ. 15.28 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, ఓదెల కస్తూర్బా హైస్కూల్‌లో నిర్మించిన డార్మెటరీ హాల్‌తోపాటు మూత్రశాలలను ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు ప్రారం భించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి