Home » Sircilla
ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ఈసారి ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 40 రోజులపాటు వర్షాలే కురవలేదు. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురవడంతో అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు.
వృద్ధులు, ఇతర బాధితులకు ఆర్థిక భరోసానిచ్చే చేయూత పింఛన్ల పంపిణీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బడుగు బలహీన వర్గాలకు కాస్త భరోసాగా నిలిచే చేయూత పింఛన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతోమంది అర్హులు ఎదురుచూస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జర్దా అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. అదనపు ఆదాయమే లక్ష్యంగా పలువురు వ్యాపారులు ప్రభుత్వఆదాయానికి గండి కొడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. జి
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లలో పారదర్శకత పాటిం చేలా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేలా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇటీవల ఆదేశించారు.
రైతులు పామాయిల్ తోటల వైపు మొగ్గు చూపాలని ఉద్యా నవన శాఖ అధికారి రాము అన్నారు. శనివారం కాల్వ శ్రీరాంపూర్లో పుప్పాల విక్రమసింహారావుకు చెందిన ఆరు ఎకరాలలో మొక్కలను నాటారు.
ప్రభుత్వరంగ బొగ్గు పరిశ్రమల్లో పని చేస్తున్న బొగ్గుగని కార్మికులకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే 12 వేజ్బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న దేశ వ్యాప్తంగా అన్నీ బొగ్గు గనుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జాతీయ సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, తుమ్మల రాజిరెడ్డి, గడ్డం కృష్ణ చెప్పారు.
గోదావరిఖని ఎల్బీనగర్లోని నర్సింగ్ కళాశాల ప్రహరీ పక్కన నిర్మిస్తున్న షాపులను కూల్చివేయడంపై వివాదం ముదురుతోంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా గణపతి మండపంతోపాటు అక్కడ ఉపాధి పొందుతున్న కొందరు చిరు వ్యాపారులు నష్టపోతున్నారు.
మండలంలో అమ లవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో వేగవంతంగా పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
సింగరేణి సంస్థ భవిష్యత్తు యువ కార్మికుల చేతుల్లోనే ఉన్నదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కమ్యూనిటీహాల్లో ఆర్జీ-2 ఏరియా యువ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
రాష్ట్రంలో పేదలకు ఉన్నత విద్యావకాశాలు మెరుగుపర్చడంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో సుల్తానాబాద్లో నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.