Home » Shubman Gill
భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్కి దిగనుంది.
విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికిన అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో తొలి వన్డేకు ముందు భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ విషయంపై మాట్లాడాడు. అతడిని ‘వన్డేలు నిజంగానే ఈజీ ఫార్మాటేనా?’ అని మీడియా ప్రశ్నించగా.. ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
టీ20 ప్రపంచ కప్-2025 భారత జట్టులో వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు చోటుదక్కని సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై గిల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను ఎవరు ఆపలేరు అంటూనే సెలెక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తానని తెలిపాడు.
మిగతా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం తీవ్రంగా విఫలమవుతూ వస్తోంది. ఇకపై ప్రతి టెస్టు సిరీస్కు ముందు కనీసం 15 రోజుల ప్రాక్టీస్ విండో ఉండాలంటూ బీసీసీఐకి గిల్ సూచించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గిల్ నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు సిద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఆ సిరీస్ తొలి మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో ఆడే ప్లేయర్పై అంతటా చర్చ మొదలైంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మాజీ భారత వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప తీవ్రంగా స్పందించాడు.
భారత్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ చాలా కాలంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఘోరంగా విఫలమయ్యాడు.
టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. ఇప్పుడు 2026లో పుంజుకుని 2027 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక సూచనతో ముందుకు వచ్చాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. శనివారం బీసీసీఐ న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించింది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నేడు సిక్కింతో జరగాల్సిన మ్యాచులో పంజాబ్ తరఫున స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో గిల్ తుది జట్టుకు దూరమయ్యాడు.