Home » Shreyas Iyer
న్యూజిలాండ్-భారత్ జట్లు నేడు రాజ్కోట్ వేదికగా రెండో వన్డేలో తలపడనున్నాయి. ఈ మ్యాచులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ అద్భుతమైన రికార్డును సాధించే అవకాశం ఉంది. మరో 34 పరుగులు చేస్తే వన్డేల్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు.
టీమిండియా.. న్యూజిలాండ్తో వడోదర వేదికగా తొలి వన్డేలో నేటి నుంచి తలపడనుంది. అయితే గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్తో పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. అయ్యర్కు పలు జాగ్రత్తలు సూచించాడు.
స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అనూహ్యంగా గాయం బారిన పడి న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. మరి తిలక్ వర్మ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపైనే ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు సిద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఆ సిరీస్ తొలి మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో ఆడే ప్లేయర్పై అంతటా చర్చ మొదలైంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మాజీ భారత వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప తీవ్రంగా స్పందించాడు.
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. దాదాపు మూడు నెలల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో రీ ఎంట్రీ ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని ముంబై జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
భారత జట్టు స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ చాలా కాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ముంబై తరఫున రెండు మ్యాచ్లు ఆడనున్నాడు. శ్రేయస్ తన పునరాగమనంలో ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు టీమిండియా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. శనివారం బీసీసీఐ న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు దూరమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్కు సంబంధించి బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అతడికి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించలేదు.
భారత జట్టు న్యూజిలాండ్తో జనవరి 11 నుంచి 18 వరకు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్పై వేటు పడే అవకాశముంది. దేశవాళీల్లో అదరగొడుతున్న సంచలన బ్యాటర్ ఇషాన్ కిషన్ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.