Home » Shamshabad
ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్స్లో బ్లాస్ట్ జరుగుతుందని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్లో హెచ్చరించారు.
శంషాబాద్లోని ఓ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్కి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానితంగా కనిపిస్తున్న ఇద్దరు ప్రయాణికులను ఎయిర్పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి లగేజ్ను తనిఖీ చేయగా అందులో కనబడిన వస్తువులను చూసి అధికారులు షాక్కు గురయ్యారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వియత్నాం బయలుదేరాల్సిన విమానం రన్వే పైనే నిలిచిపోయింది. టేకాఫ్ అవ్వకుండా.. కొన్ని గంటల పాటు ప్రయాణికులతో అలానే ఉండిపోయింది. దీంతో ప్రయాణికులు వియత్నాం ఎయిర్బస్సు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాన్ని ముంబయి ఎయిర్ పోర్ట్కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్పై పోలీసులకు సెక్యూరిటీ అధికారులు ఫిర్యాదు చేశారు.
జెడ్డా నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానంలో నగరంలోని అంబర్పేటకు చెందిన మహ్మద్ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతీ ప్రయాణికుడి బ్యాగ్లను భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుంటారు. అయితే ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వరకు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం సాయంత్రం గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. 24 నిమిషాల వ్యవధిలోనే ఊపిరితిత్తులు ఆస్పత్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు చేశారు దుండగులు. బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు దుండగులు. ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు.