Home » Sensex
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు (సెప్టెంబర్ 26న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ల విషయంతో భారతీయ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. ప్రధానంగా ఫార్మా సెక్టార్ మీద పెద్ద దెబ్బ పడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 22న) స్పల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో బెంచ్మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ50 సూచీలు దిగువకు పయనిస్తుండగా, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి.
భారత స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ 17న మరోసారి దుమ్మురేపింది. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజు తమకు తాము సవాల్ విసిరినట్టు సరికొత్త గరిష్ఠాల్ని చేరాయి. ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ చర్చలు సానుకూల దిశగా సాగాయన్న సంకేతాలతో ఇన్వెస్టర్ల ఉత్సాహం పెరిగింది.
నేటి సూచీలు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అయితే, ఆటోమొబైల్, వైట్ గూడ్స్, హెల్త్ కేర్, సిమెంట్, హోటల్స్ రంగాల షేర్లు లాభపడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరోసారి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభం నుంచే మద్దతు పలికిన గ్లోబల్ సూచనలు, దేశీయ ఆర్థిక విధానాల్లో భరోసా కలిగించే మార్పులు మార్కెట్ మూడ్ను మరింత పెంచేశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో వచ్చే వారం మరింత కొత్త ఉత్సాహం కనిపించనుంది. ఈ వారం 4 కొత్త ఐపీఓలు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీంతోపాటు 10కిపైగా కంపెనీలు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లలో నిన్న లాభాలతో సంబరపడిన ఇన్వెస్టర్లు, ఈరోజు (ఆగస్టు 8, 2025) ఊహించని నష్టాల భారం మోస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మార్కెట్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి వచ్చేసింది. రాబోయే వారం దాదాపు 10కిపైగా కంపెనీలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ట్రంప్ సుంకాల పోటుతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా భారీ క్షీణతను చవిచూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25% సుంకం విధించారనే వార్త మార్కెట్లో ఆందోళనను రేకెత్తించింది. దీంతో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి.