Home » Sankranthi festival
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం, లక్కవరం, కేతవరం, ఎ.పోలవరం, తాడువాయి, పేరంపేట గ్రామాల్లో పందెం బరులకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు..
సంక్రాంతి వేళ ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరో 10 ప్రత్యేక రైళ్లను అనౌన్స్ చేసింది. రేపటి నుంచి (జనవరి 11) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ.. విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణంగా పంతంగి టోల్ప్లాజా నుంచి రోజుకు 35 వేల నుంచి 40 వేల వాహనాలు వెళ్తుంటాయి. నిన్న (శుక్రవారం) ఒక్కరోజే 65 వేల వాహనాలు టోల్ప్లాజాను దాటాయి.
సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన వారు సొంతూళ్ల బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి..
సాధారణంగా తిరుగు ప్రయాణంలో చార్జీల మోత ఉంటుంది. ఈసారి ఆర్టీసీ సర్వీసులు తక్కువ నడపడం, వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం, డిమాండ్కు అనుగుణంగా రైళ్లు నడవకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్ల వంట అ౦డింది. స్పెషల్ పేరుతో అయిన కాడికి దోచేస్తున్నారు.
సంక్రాతి పండుగకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం రాత్రి నుంచే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే బస్సులు, రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు మూడొందుల మంది తమతమ స్వస్థలాలకు వెళ్లనున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు, ఆఫీసులకు వీకెండ్ కావడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నగర వాసులు పోటెత్తారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో గాలిపటాల సందడి మొదలైంది. అయితే గాలిపటంతో ఆడుకునే సమయంలో చైనా మాంజాతో పలువురు గాయపడిన ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మెట్పల్లిలో చైనా మాంజా వల్ల గొంతు కోసుకుని నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా ఝులిపించారు..