Home » Sankranthi festival
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఏలూరు జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది..
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్ బై: సన్ ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్ వాసి అగరబత్తి) హైదరాబాద్లో అంగరంగ వైభవంగా సోమవారం జరిగాయి. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వచ్చిన మహిళలు అందరూ పోటాపోటీగా రంగవల్లులను తీర్చిదిద్దారు.
విజయవాడలో బొమ్మల కొలువు కొలువుతీరింది. స్థానిక విజయశ్రీ అనే మహిళ దేవీ పురాణం, భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది.. నెలలపాటు శ్రమించి ఈ బొమ్మల కొలువు తీర్చిదిద్దారు. దేవి బాల్యం, బాలిక, స్త్రీ, మోక్ష దశలను చిత్రీకరించారు.
సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కడ చూసినా పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈ మధ్య కొంతమంది వాడుతున్న మాంజా వల్ల పక్షులు, జంతువులకు మాత్రమే కాదు.. మనుషుల ప్రాణాలకూ పెను ముప్పు వాటిల్లుతోంది.
సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న వారు పల్లె బాట పడుతున్నారు. దీంతో ఏపీలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది.
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దిల్సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది..
భూమాత పరిచిన పచ్చని తివాచీల్లాంటి వరిచేలు... అందమైన కొబ్బరిచెట్ల నడుమ... నేలకు దిగి వచ్చిన ఇంద్రధనస్సులా సాగుతుంది కోనసీమ ‘ప్రభల తీర్థం’. అదొక దృశ్య కావ్యం లాంటిది.
సంక్రాంతి సందర్భంగా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి నడిపే షెడ్యూల్డ్ బస్సులు.. ఫుల్ అవుతుండడంతో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు అదనంగా స్పెషల్ బస్సులు నడుపుతున్నాయి.
వారం కిందట బందరులో జరిగిన జాతీయ రహదారుల సంస్థ అధికారుల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ కంచికచర్ల బైపాస్ దగ్గర దెబ్బతిన్న రోడ్డు గురించి ప్రస్తావించారు. ఆ రోడ్డును సరిచేయకపోతే పండగకి సొంతూర్లకు వచ్చే వారితో ట్రాఫిక్ కష్టాలు కలుగుతాయని, తక్షణం మరమ్మతులు చేయాలని సూచించారు..
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని మరింత పెంచారు. కనిష్టంగా 10 నిమిషాల నుంచి గరిష్టంగా 150 నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరుకునేలా రైళ్ల సమయాలను రీ షెడ్యూల్ చేశారు..