Home » Rohit Sharma
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగబోతున్నాడు.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్లో బరిలోకి దిగబోతున్నాడు.
సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సన్నదమవుతున్నారు. ముంబైలోని శివాజీ పార్క్ స్టేడియంలో రోహిత్ కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ ప్రాక్టీస్ను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఈ స్టేడియానికి వస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాజీ సహచరుడు అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో ముంబైలోని శివాజీ స్టేడియంలో శుక్రవారం రెండు గంటల పాటు సాధన చేశాడు.
సాధారణంగా క్రికెటర్లు అంటేనే కొత్త కార్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఉత్సాహంగా లాంగ్ ట్రిప్ వేసుకొని మైండ్ని రిఫ్రెష్ చేసుకొని, పోటీకి సిద్ధం అవుతుంటారు. తాజాగా, టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ మరో కొత్త కారు కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెలలో జరిగే వన్డే సిరీస్ కోసం బరిలోకి దిగబోతున్నారు. 2027 ప్రపంచకప్ వరకు వారు జట్టులో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టీమిండియాకు నాయకత్వం వహించిన వారిలో రోహిత్ శర్మ ఎన్నో గుర్తుండిపోయే విజయాలు అందించాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా 2023 ప్రపంచకప్ ఫైనల్కు వెళ్లింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. వన్డేల్లో రోహిత్కు మంచి రికార్డ్ ఉంది.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో టీమిండియా జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, ఈ టూర్లో రోహిత్తో పాటు కోహ్లీ కూడా పాల్గొననున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లోపలికి వెళుతూ రోహిత్ కెమెరాలకు చిక్కాడు. హాస్పిటల్ లోపలికి వెళుతున్న రోహిత్ను బయట ఉన్న వారు ప్రశ్నలు అడిగారు.