Home » Road Accident
కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లాలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ హాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా - గులావతి రహదారిపై బస్సు, ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
బిహార్లోని కటిహార్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
పల్నాడు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారుపై సిమెంట్ ప్లయాస్ లారీ బోల్తాపడింది.
రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ఏలూరు జిల్లాలో ఆగి ఉన్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.
కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. అంబులెన్స్ను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మసీద్ బండ నుంచి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఓ కారు అదుపు తప్పి ట్రాఫిక్ అవుట్పోస్టును బలంగా ఢీకొట్టింది.