Home » Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక సూచనలు చేశారు.
కాలేజీ విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్ (ఈవీ) స్కూటీలు అందించబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ శాసనమండలి సమావేశాలు కూడా ఇకపై అసెంబ్లీ భవనంలోనే జరగనున్నాయి. ఈ నెల 16న ప్రా రంభం కానున్న బడ్జెట్ సమావేశాల నుంచే ఇది అమల్లోకి రానుంది.
హైదరాబాద్ మహానగరంలో చెరువుల కబ్జాకు గురవుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కబ్జాలకు గురైన చెరువులను హైడ్రా కాపాడి పునరుద్ధరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో FIA హాకీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ 2026 టోర్నమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవాళ రాత్రి 7:00 గంటలకు ఈ టోర్నీని సీఎం ప్రారంభించనున్నారు.
ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని అభినందించారు.
శాంతియుత వాతావరణంలోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తామని చెప్పారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 124 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది.