Home » Revanth Reddy
ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు..
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఈ విచారణ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనదైన రీతిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే..
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ సందర్శన సందర్భంగా విద్యార్థులు, ప్రొఫెసర్లతో, ఇతర డెలిగేషన్లతో చివరి రోజు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ప్రతిపాదించడంలో విద్యార్థులు తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలని, ఈ విజన్ను ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సీఎం పిలుపునిచ్చారు..
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి సిట్ పేరిట కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ను వేధించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసానికి పోలీసులు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 90 స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పార్టీ టార్గెట్గా పెట్టుకుంది.
ప్రభుత్వ పాఠశాలలో చదివి రాజకీయాల్లోకి వచ్చి.. తక్కువ సమయంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో హార్వర్డ్ సర్టిఫికెట్ పొందిన తొలివ్యక్తిగా రేవంత్ రెడ్డి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. 'లీడర్షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ' కోర్సును సీఎం విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికెట్ పొందారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విప్లవాలు రక్తపాతంతో కూడిన యుద్ధాల ద్వారా జరిగితే, గాంధీజీ మాత్రం 'సత్యాగ్రహం' అనే కొత్త పంథాను ఎంచుకున్నారు. 'కంటికి కన్ను అనే సూత్రం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది' అని నమ్మిన మహాత్మా గాంధీ, ద్వేషాన్ని ప్రేమతో జయించవచ్చని నిరూపించారు.