Home » Revanth Reddy
హామీల పేరుతో జనాన్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో బస్సు తప్ప మిగతాదంతా తుస్సు అని ఎద్దేవా చేశారు..
గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్, పరిగి ప్రజల కాళ్లు కడుగుతామని, వికారాబాద్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలది చీకటి ఒప్పందమని రేవంత్ విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తమను విమర్శించే ముందు సీఎం రేవంత్రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
మాజీ సీఎం కేసీఆర్కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని.. దాంతో నగర కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు..
మల్కాజిగిరి నుంచి బరిలో దిగినప్పుడు తనకు జమియత్ స్వచ్ఛందంగా సహకరించిందని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. తాను గల్లీ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఈ సంస్థ సహకరించిందని పేర్కొన్నారు.
మంత్రి వివేక్వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని, ఆ మాట కేసీఆర్ బిడ్డ కవితనే చెబుతున్నదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు.