Home » Resign
ఆప్ నాయకత్వంలో ఎంసీడీ పనితీరుతో తాము అసంతృప్తిగా ఉన్నట్టు కౌన్సిలర్ హిమాని జైన్ తెలిపారు. ఆ కారణంతోనో తాను, మరికొందరు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి 'ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు చెప్పారు.
మమతా కులకర్ణి నియామకంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నర్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె తాజా నిర్ణయం తీసుకున్నారు.
టిక్కెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో అంతర్గత పరిస్థితులపై అసంతప్తి వంటి కారణాలు ఎమ్మెల్యేల రాజీనామాకు దారితీసినట్టు ప్రచారం జరుగుతుండగా, వీరి తదుపరి చర్యపై కూడా చర్చ జరుగుతోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాత్రం వేరే పార్టీలో చేరే అవకాశాలపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేదు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండేకర్కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్యాబినెట్లో చోటు దక్కలేదు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారంనాడు విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాలో సీలంపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా జుబైర్ అహ్మద్ను నిలబెట్టింది. దీంతో 24 గంటలు తిరక్కుండానే అబ్దుల్ రెహ్మాన్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
మహారాష్ట్ర కొత్త సీఎం రేసులో ఏక్నాథ్ షిండే ఉన్నారంటూ ఆయన వర్గం బలంగా చెబుతుండగా, మరోవైపు ఆయనపై ఉద్ధవ్ శివసేన వర్గం విమర్శలు ఎక్కుపెట్టింది. షిండే రాజకీయాల్లోంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు.
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు గెహ్లాట్ రాజీనామా లేఖ రాశారు. అమలుకు నోచుకోలేని వాగ్దానాలు, ఇటీవల తలెత్తిన వివాదాలు వంటివి తన రాజీనామాకు కారణాలుగా అందులో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
శిరోమణి అకాలీ దళ్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ప్రతి ఐదేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ సింగ్ చీమా తెలిపారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు.
జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులు సమర్పించానని రెజ్లర్ వినేశ్ ఫోగట్ తెలిపారు.