Home » Resign
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుదేలైన అన్నాడీఎంకేకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సి.విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు.
తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు.
కర్ణాటకలో నాయకత్వ పోరుకు తెరపడనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు అధిష్టానం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసి కేంద్రంలో కీలక పాత్ర పోషించాల్సిందిగా కోరిందని తెలుస్తోంది.
అన్నాడీఎంకేకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా, అంబసముద్ర ఎమ్మెల్యే డాక్కర్ ఎసాక్కీ సుబయా తాజాగా తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్కు సమర్పించారు.
అన్నాడీఎంకేకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్.సెమ్మలై రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చవిచూడటం, పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో సెమ్మలై రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్కుమార్కు సమర్పించారు.
రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారంనాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్కు అందజేశారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మార్చి 30న సీఎం, ఎమ్మెల్సీ (MLC) పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికయ్యారు.
బాధ్యత కలిగిన భారతీయుడుగా తాను జన్ సురాజ్ పార్టీలో చేరానని, పూర్తి నిజాయితీతో ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నానని, పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ చింతించడం లేదని పాండే తెలిపారు.
పదవులో, పొజిషన్ కోసమే తాను రాజకీయాల్లోకి చేరలేదని, జవాబుదారీతనం, అంతర్గత ప్రజాస్వామ్యం, అట్టడుగు వర్గాల వాణిని ప్రతిబింబించే ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని నెలకొల్పుతామనే ఆప్ వాగ్దానంతో రాజకీయాల్లోకి వచ్చానని పాలేకర్ చెప్పారు.