Home » Republic day
10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోరి కర్తవ్యపథ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనేక రాష్ట్రాల శకటలను ప్రదర్శించారు. వాటిల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ కర్రతో ప్రత్యేక నైపుణ్యాన్ని ఉపయోగించి తయారు చేసే బొమ్మలు దేశవిదేశాల్లో ఆదరణను చూరగొన్నాయి.
దేశ చరిత్రలోనే తొలిసారి పుల్వామాలోని ప్రఖ్యాత ''ట్రాల్ చౌక్''లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తరాల మధ్య ఐక్యత, దేశం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ''స్వచ్ఛభారత్'' పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
రిపబ్లిక్ డే సందర్భంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలో త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, బీజేపీ అన్ని రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కిందని విమర్శించారు.
డిబ్రూగఢ్ జర్నీలో ఈరోజు ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, అసోం రెండవ రాజధానిగా డిబ్రూగఢ్ నిలువ నుందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగడం ఇదే మొదటిసారని అసోం సీఎం చెప్పారు
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
భారతదేశం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే, ఈసారి కూడా, భారతదేశ సైనిక శక్తి, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథంలో ప్రదర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే శాసనమండలిలో ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించడానికి, సంపన్న భారతదేశాన్ని నిర్మించడానికి తమ ప్రయత్నాలను బలోపేతం చేయాలనే సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.