Home » RCB
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతోన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ , ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో చెలరేగిన వివాదం రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటోంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సరదాగా మొదలైన ఈ వివాదం, ఆట ముగిసిన తర్వాత హెడ్తో కరచాలనం చేయడానికి కోహ్లీ నిరాకరించడంతో ఒక్కసారిగా ముదిరింది.
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. జట్టును ఫైనల్కు చేర్చడంలో కోహ్లీ పాత్ర కీలకంగా మారనున్న వేళ.. అతడి ప్లే ఆఫ్స్ రికార్డు మాత్రం ఆర్సీబీ అభిమానులను కాస్త కలవరపెడుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ ప్లే ఆఫ్స్లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ప్లే ఆఫ్స్కు చేరిన నాలుగు జట్లలో ఏ టీమ్ టైటిల్ గెలిచినా.. దానికి అది రెండోది కానుంది.
ఆర్సీబీ నుంచి తప్పుకోవడంపై స్టార్ పేసర్ యశ్ దయాల్ తొలిసారి స్పందించాడు. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఓ పాడ్కాస్ట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఆర్సీబీ ఓపెనింగ్ కాంబినేషన్పై ఆసక్తికర చర్చ సాగుతోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జోడీగా ఎవరు బరిలోకి దిగుతారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై కెప్టెన్ రజత్ పాటీదార్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు.
ఆర్సీబీ ఓపెనర్ సాల్ట్ ఫిట్నెస్ సాధించడంతో జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. గత రెండు మ్యాచ్ల్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన వెంకటేశ్ అయ్యర్ను తప్పిస్తారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీకి పలు కీలక సూచనలు చేశాడు.
ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెడ్కు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో మరో భారీ స్కోర్ నమోదైంది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతోన్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన సన్రైజర్స్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.